తమ మహాకూటమి అధికారంలో వున్నప్పుడు.. రాష్ట్రంలో ఎలాంటి అలజడులు లేకుండా సవ్యంగా పాలన సాగిందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు కూడా అదుపులో వున్నాయని.. రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. అయితే తమ కూటమి సవ్యంగా సాగడాన్ని జీర్ణించుకోలేని బీజేపి కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్నందన విచ్ఛిన్నం చేసి.. నితీష్ తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వెనుక కుట్ర వుందని, అప్పుడు చెప్పినా నితీష్ వినిపించుకోలేదని అన్నారు. అయితే అదును చూసిన బీజేపి తమ కుట్రను ఇప్పుడు రాష్ట్రంలో కొనసాగిస్తుందని అరోపించారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పని ఇక ముగిసిందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ఢిల్లీలోని రైల్వే స్టేషన్ కు చేరుకున్న ఆయన అక్కడి మీడియా ప్రతినిధులను ఉద్దేశించి కొద్దిసేపు మాట్లాడారు. ‘‘బీహార్ మొత్తం అల్లర్లు, హింసతో అట్టుడుకుతోంది. నన్ను నిర్బంధంలోకి పంపిన తర్వాత, రాష్ట్రాన్ని మొత్తం బీజేపీ రావణకాష్ఠంగా మార్చేసింది. ఇక నితీశ్ పని అయిపోయింది...’’ అని లాలూ పేర్కొన్నారు. దాణా కుంభకోణం కేసుల్లో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ సీఎం లాలూ ఆరోగ్యం ఇటీవల తీవ్రంగా క్షీణించింది. దీంతో ఆయనకు చికిత్స అందించేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఈ నెల 17న బీహార్ లోని భాగల్పూర్ లో మత ఘర్షణలు చోటుచేసుకున్న తరువాత సమస్తీపూర్, ఔరంగబాద్ లలో కూడా మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో లాలూ దీనిపై స్పందించారు. కేంద్రమంత్రి అశ్విని చౌబే కుమారుడు అర్జిత్ శాశ్వత్ నాయకత్వంలో బీజేపీ, ఆరెస్సెస్, భజరంగ్ దళ్ కార్యకర్తలు నిర్వహించిన ఓ ఊరేగింపు సందర్భంగా అల్లర్లు చోటుచేసుకున్నాయి. హింసను రెచ్చగొట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శాశ్వత్పై ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ... అరెస్టు చేయడంలో జాప్యం జరగడంపై ప్రతిపక్షాలు నితీశ్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more