రాష్ట్రంలో తృతీయ ప్రత్యమ్నాయ పార్టీగా అవిర్భవించిన జనసేన.. 2019లో జరగనున్న తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తామని కూడా ఇప్పటికే ప్రకటించిన క్రమంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు భద్రతను పెంచారు. గుంటూరులో ఈ నెల 14న నిర్వహించిన మంగళగిరి సభ అనంతరం ఆయన తనకు రక్షణ కల్పించాలని ఏకంగా ఏపీ డీజీపీని కోరారు. దీనిపై పదిరోజుల తరువాత నిర్ణయం తీసుకున్న పోలీసులు.. పవన్ కల్యాన్ కు భద్రత కల్పించేందుకు సిద్దమయ్యారు.
దీంతో ఇప్పటి వరకు తన వ్యక్తిగత ప్రైవేటు భద్రతా సిబ్బంది రక్షణ వలయం మధ్యలో వున్న జనసేనానికి ఇక ప్రభుత్వం రక్షణ కూడా అందుబాటులోకి రానుంది. ఇకపై సాయుధులైన ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ఆయన వెంట అనుక్షణం ఉంటారు. ఈ మేరకు '2 ప్లస్ 2' విధానంలో నలుగురు సిబ్బందిని కేటాయిస్తూ, అంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు వెలువరించింది. పోలీసు శాఖకు చెందిన నలుగురు గన్ మెన్లను రెండు షిప్టుల్లో కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులు వెలువరించింది.
జాతీయస్థాయిలో తృతీయ కూటమిపై పవన్ సమాలోచన
రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ వద్దు.. రాష్ట్ర్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ కూడా వద్దు.. అయితే జాతీయ స్థాయిలో అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయం పట్ల స్పందించే ఒక గొంతు వినిపించాలని అది మనమే ఎందుకు కాకూడని, మనమే తృతీయ ఫ్రంట్ గా ఎందుకు ఏర్పడకూడదని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ తన అభిమతాన్ని వెల్లడించారు. ఇవాళ ఉదయం వామపక్షాలతో సమావేశమైన జనసేనాని తాజా రాజకీయ మార్పులు సహా పలు అంశాలపై చర్చిస్తూ, తన మనసులో ఉన్న థర్డ్ ఫ్రంట్ ఆలోచనను కూడా పంచుకున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్ర స్థాయి వామపక్షాల నేతలకు తన మనసులోని ఆలోచనను చెప్పిన పవన్ ఇలా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే ఎలా వుంటుందని తన అభిమతాన్ని చెప్పిన పవన్.. ఇదే విషయాన్ని జాతీయ నేతల వద్ద ప్రస్తావించి చూడాలని కూడా చెప్పారు. సిద్ధాంతాల పరంగా ఒకే భావజాలమున్న పార్టీలను ఏకం చేయాలని కూడా కోరారు. ఈ తృతీయ కూటమి బాధ్యతలను సీపీఐ, సీపీఎం పార్టీలకే అప్పగిస్తానని పవన్ కల్యాణ్ వెల్లడించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అటు కాంగ్రెస్ ఇటు బీజేపి దేశ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని ఆయన అభిప్రాయపడ్డారని సమాచారం. అయితే పవన్ అలోచనలపై వామపక్ష నేతల నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో వేచిచూడాలి మరి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more