కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కలిసున్న తెలుగుదేశం, బీజేపీ పార్టీల మధ్య ఉన్న బంధం బద్దలైన సంగతి తెలిసిందే. అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన పరిణామాలను ఒక్కసారి గమనిస్తే...
* పార్లమెంట్ బడ్జెట్ మలివిడత సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి చేస్తున్న నిరసనలను తెలుగుదేశం వైకాపా కొనసాగించాయి.
* రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఎంపీలు గాంధీ విగ్రహం ముందు బైఠాయించారు.
* ఆపై 11 గంటలకు లోక్ సభ ప్రారంభంకాగా, వివిధ పార్టీల ఎంపీల ఆందోళనతో నిమిషాల్లోనే వాయిదా పడింది
* ప్రత్యేక హోదా సాధనా సమితి ఆధ్వర్యంలో పార్లమెంట్ ముట్టడి జరుగగా పోలీసుల లాఠీచార్జ్ తో ఉద్రిక్త పరిస్థితి.
* ఏపీకి హోదా ప్రకటించే ప్రతిపాదనలు తమ వద్ద లేవని కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి ఇంద్రజిత్ వెల్లడి
* ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర వైఖరిపై గట్టిగా నిలదీత, కేంద్రం చేస్తున్న అన్యాయాలను ఇక భరించే ఓపిక లేదని హెచ్చరిక
* ఆపై సాయంత్రం అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా లేదని, ప్యాకేజీకి కట్టుబడి ఉంటామని ప్రకటన. అది కూడా గతంలో ఇచ్చిన దానికి లెక్కలు చెప్పిన తరువాతనేనని వెల్లడి
* జైట్లీ సమావేశం తరువాత ఎంపీలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్. కేంద్రం నుంచి వైదొలిగే విషయంలో ఏకాభిప్రాయం.
* ఆపై మంత్రులు, ముఖ్య నేతలతో మాట్లాడిన చంద్రబాబు. అందరిదీ ఒకే మాట.
* సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజుతో చంద్రబాబు ఫోన్ సంభాషణలు, పార్టీ ఏనిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్న ఇద్దరు కేంద్ర మంత్రులు.
* రాత్రి 10.30 గంటలకు చంద్రబాబు ప్రెస్ కాన్ఫరెన్స్. మంత్రుల రాజీనామాలపై ప్రకటన.
* రాత్రి 11 గంటలకు బీజేపీ ప్రెస్ కాన్ఫరెన్స్... ఏపీలో తమ మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ రాజీనామాలు చేస్తారని ప్రకటించిన విష్ణుకుమార్ రాజు
I tried reaching out to the Prime Minister to inform him about our decision. But sadly, he was unavailable.
— N Chandrababu Naidu (@ncbn) March 7, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more