ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఏపీ విభజన హామీల అశంపై ఢిల్లీలో కేంద్ర మంత్రి సుజనా చౌదరితోనూ గంటసేపు చర్చించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వివరణ ఇచ్చారు.
జీఎస్టీ రాబడి కేంద్ర, రాష్ట్రాలకు పంపిణీ జరుగుతుందని అన్నారు. తగినంత రాబడి లేకపోవడం వల్లే ఈశాన్య రాష్ట్రాలకు గతంలో ప్రత్యేక హోదా ఇచ్చారని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలకు 90:10 నిష్పత్తిలో నిధుల పంపిణీ జరుగుతోందని వివరించారు. 14వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికి కూడా హోదా ఇవ్వకూడదని తెలిపిందని.. ప్రస్తుతం ఏ రాష్ట్రానికి కూడా హోదా లేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ నేతలు, చంద్రబాబు నాయుడు విజ్నప్తులను తాము అర్థం చేసుకున్నామని.. కానీ, సెంటిమెంట్లతో ఇలాంటి వ్యవహారాలు సాధించుకోలేరని ఆయన హితవు పలికారు.
కొన్ని పరిణామాల వల్ల ప్రత్యేక హోదా అనే విధానమే మనుగడలో లేకుండా పోయిందని జైట్లీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజలకు ఇష్టం లేకుండానే రాష్ట్ర విభజన జరిగిందని, ఆ సమయంలో ఏపీకి రెవెన్యూ లోటు పూడ్చాలని విభజన చట్టంలో ఉందని అన్నారు. ప్రతీ ఐదేళ్ల కోకసారి పన్నేతర సాయం రాష్ట్రాలకు అందిస్తామని.. నిధుల లేమితో బాధపడుతున్న ఏపీకి సాయం చేస్తామని చెప్పారు. ఏపీ తీసుకునే విదేశీ రుణాల్లో 90 శాతం కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. విదేశీ సంస్థల ద్వారా కాకుండా నాబార్డ్ ద్వారా నిధులను ఇవ్వాలని ఏపీ కోరింది. దీని వల్ల రుణ పరిమితి తగ్గుతుందని తెలిపారు.
ఐదేళ్లపాటు 90 శాతం రుణాలను కేంద్రం భరిస్తుంది. హోదా వల్ల పథకాల్లో కేంద్రం వాటా 90శాతం ఉంటే.. రాష్ట్రం 10 శాతం భరిస్తుంది. ఆ లెక్కన ఏపీకి ప్రత్యేక హోదా కాకుండా కేవలం ప్యాకేజీత సరిపెట్టబోతున్నామన్న విషయాన్ని జైట్లీ కుండబద్ధలు కొట్టేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more