అర్థరాత్రి అందరూ నిద్రిస్తున్న వేళ.. ఒక్కసారిగా ప్రకృతి ప్రళయరూపం దాల్చింది. దీంతో తూర్పు ఆసియా దేశం తైవాన్ ను వణికించింది. తైవాన్ లో భూమి కంపించింది. రిక్డరట్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా నమోదైంది. భూకంపం ధాటికి తైవాన్ తూర్పుతీరంలోని పట్టణమైన హువాలియెన్ లో భారీ భవంతులు, ఇతర నిర్మాణాలు కుప్పకూలాయి. ఒక్కసారిగా ఇళ్లలొంచి ప్రజలు హాహాకారాలు పెడుతూ భయటకు పరుగులు తీశారు.
అర్ధరాత్రి కావడంతో నిద్రలోకి జారుకున్న వందలాది మంది కూలిన భవంతుల్లో చిక్కుకుపోయి ఆర్తనాదాలు చేస్తున్నారు. ఒక్కసారిగా పట్టికుదిపేసిన భారీ భూకంపం ప్రభావంతో ఆ తరువాత వంద సార్లు భూమి కంపించింది. ఈ ప్రకంపసలు కూడా స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. వందలాది భవంతులు తమ స్థానాలనుంచి కదిలి నెలకొరిగే క్రమంలో వున్నాయి.
ఈ భూకంపం ధాటికి ఇప్పటికే నలుగురు మరణించారని అధికారులు చెప్పగా, సుమారుగా 177 మంది గల్లంతయ్యారని సమాచారం. దీనికి తోడు ఇప్పటికే 226 మంది ప్రజలు గాయాలపాలైయ్యారు. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు శిధిలావస్థలకు చేరుకుని కుప్పకూలడానికి సిద్దంగా వున్న భవంతుల్లో వున్నవారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. అయితే భూకంపం ధాటిక ఓ పక్కకు ఒరిగిన భవంతుల్లోకి ప్రజలు వెళ్లవద్దని.. అవి ఏ క్షణంలోనైనా కుప్పకూలవచ్చునని అధికారులు అదేశాలు జారీ చేశారు.
కాగా, హువాలియెన్ కు 21 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియాలాజికల్ సొసైటీ తెలిపింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది. ఇక్కడి ప్రఖ్యాత మార్షల్ హోటల్ భవనం కూలిపోయిన దృశ్యాలు అత్యంత భీతిగొలిపించేలా ఉన్నాయి. తీవ్రమైన భూకంపం కావడంతో తైవాన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. యుద్ధప్రాతిపదికన సహాయకార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సిఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more