తెలంగాణ కుంభమేళ.. ప్రతీ రెండేళ్ల ఓ పర్యాయం జరిగే గిరిజన దేవతల జాతరలో మధ్యం పొంగిపోర్లింది. గత ఏడాది కంటే అధికంగా మద్యం అమ్మాకాలు జరిగాయి. సమ్మక్క, సారక్క జాతరలో సర్వసాధారణంగా బెల్లం, కొడిపుంజుల అమ్మాకాలు సాగుతుంటాయి. అయితే మద్యం ప్రియులు మాత్రం ఈ జాతరలో బంధుమిత్రులతో కలసి మద్యం సేవిస్తుంటారు. అడవారు అమ్మవారికి సమర్పించిన కోళ్లు, బెల్లాన్ని తమ వంటకాలతో కలసి వండుతున్న క్రమంలో మగవారు అందులోనే మధ్యం ప్రియులు మాత్రం పక్కనే తమ పని కానిచ్చేస్తుంటారు.
ఈ క్రమంలో తెలంగాణ కుంభమేళాలో మద్యం అమ్మకాల డిమాండ్ పెరుగగా, అందుకు తగ్గట్టుగానే ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఎక్సైజ్ శాఖ భారీ ఆదాయాన్ని పొందింది. . దీంతో ప్రతీ పర్యాయం ఎప్పటిక్కప్పుడు అమ్మాకాలను తగ్గట్టుగా సప్లై ముందుగానే సమకూర్చుకుంటారు. జాతర నేపథ్యంలో కేవలం ఏడు రోజులు మాత్రమే అమ్మాకాలను సాగించేందుకు ప్రభుత్వ స్థానిక గిరిజనులకు ప్రత్యేకంగా అనుమతులను ఇస్తుంది. ఇలా ఏడాదికేడాది పెరుగుతున్న లైసెన్సుల సంఖ్య ఈ ఏడాదికి వచ్చే సరికి 22 బార్లకు అనుమతులిచ్చారు.
దీంతో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకూ మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. ఈ క్రమంలో ఈ బార్లతో వారం రోజుల వ్యవధిలో రూ. 4 కోట్ల మేర అదాయాన్ని అర్జించగా, ఇక చుట్టుపక్కనున్న వరంగల్. వరంగల్ రూరల్, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగాం, ఖమ్మం, కొత్తగూడెం, అదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి సహా పలు జిల్లాలోని మద్యం దుకాణాల ద్వారా మొత్తంగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ 50 కోట్ల రూపాయల అదాయాన్ని ఈ జాతర ద్వారా సమకూర్చుకుంది ఎక్సైజ్ శాఖ.
ఈ క్రమంలో కనీస ధరలకు తూట్లు పెడుతూ మధ్యం దుకాణ వ్యాపారులు తమ ఇష్టానుసారరం ధరలను నిర్ణయించుకుని అమ్మాకాలు చేపట్టారు. ఇంత భారీ స్థాయిలో మేడారం జాతరల్లో అమ్మకాలు ఎన్నడూ సాగలేదని అధికారులు అంటున్నారు. కాగా గత పర్యాయం కన్నా ఈ సారి రూ. 3 కోట్ల పైచిలుకు రూపాయల అమ్మాకాలు అధికంగా సాగాయని ఎక్సైజ్ అధికారుల గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక జాతర ముసుగులో అక్రమ సారా కూడా రాజ్యమేలిందన్న అరోపణలు వినబడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more