రాజకీయ నాయకులు నోట్లో త్వరలోనే పచ్చి వెలక్కాయ పడనుందా..? ఎలాగైనా చట్టసభల్లో తాము ప్రాతినిధ్యం వహించాలని ఎదురుచూస్తున్న నేతలు ఒక్క స్థానం కాకపోతే మరో స్థానం నుంచి కూడా పోటీచేసి తమ అదృష్టాలను పరిక్షించుకునే నేపథ్యానికి ఇక చరమగీతం పాడబోతున్నారా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. ఈ మేరకు రాజకీయ నేతలు ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.
ఒక్క వ్యక్తికి ఒక్క ఓటు ఓ నేతకు ఒకే నియోజకవర్గం అన్న సారాంశంతో ఈ మేరకు అశ్వినీ ఉపాధ్యాయ అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యాన్ని విచారణకు స్వీకరించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ అంశంలో ప్రభుత్వం అభిప్రాయమేంటోనని తెలుసుకునేందుకు అటర్నీ జనరల్ కెకె వేణుగోపాల్ ను తమ ఎదుట హాజరుకావాలని అదేశాలు జారీ చేసింది. కాగా, పిటిషనర్ వాదనతో కేంద్ర ఎన్నికల సంఘం పూర్తీగా ఏకీభవించింది. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. అటార్నీ జనరల్ హాజరును కోరింది.
అంతకుముందు అశ్వినీ ఉపాధ్యాయ సమర్పించిన పిల్ నేపథ్యంలో త్రిసభ్య దర్మాసనం ఎదుట హాజరైన ఎన్నికల సంఘం అధికారులు.. తాము పూర్తిగా ఈ వాజ్యంతో ఏకీభవిస్తున్నామని అన్నారు. ఈ మేరకు గతంలోనే 2004లో ఒక పర్యాయం, 2016లో మరో పర్యాయం కేంద్రానికి లేఖలు కూడా రాశామని చెప్పారు. తమ లేఖల సారాంశాన్ని పరిశీలించిన కేంద్ర న్యాయశాఖ సమ్మతించినా.. కేంద్రం నుంచి ఎలాంటి బదులు మాత్రం రాలేదని పేర్కొంది.
ఎన్నికల తరువాత అభ్యర్థులు రెండు స్థానాల్లో విజయం సాధించిన పక్షంలో ఉఫఎన్నికలను నిర్వహించాల్సి రావడం.. ఇందుకు భారతీగా ప్రజాధనం కూడా ఖర్చవుతుందని అందుకనే రెండు చోట్ల పోటీ చేసే వెసలుబాటును కల్పించిన రాజ్యంగాలోని ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33(7)ను సవరించాలని కూడా తాము కోరామని ఎన్నికల సంఘం అధికారులు కేంద్రాని కోరారు. అంతేకాకుండా ఇలా ఎన్నికలు జరిగిన తరువాత అరుమాసాలలోపు మరోమారు ఎన్నికలు వస్తే ప్రజలకు కూడా విముఖత వ్యక్తం చేస్తున్నారని తెలిపింది. వీటి ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై కూడా పడే అవకాశముందని పేర్కొంది.
దీంతో ఒక నేత ఒకే చోట పోటీ చేసేలా చట్ట సవరణ చేయాలన్నది తమ అభిప్రాయమని ఈసీ పేర్కొంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై ఎలాంటి చర్య తీసుకోలేదని ఎన్నికల సంఘం వివరించింది. ఒక నేత.. ఒకేచోట పోటీ చేయాలన్న అంశంపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే చట్ట సవరణ జరగని పక్షంలో ఉపఎన్నికలు వచ్చిన పక్షంలో అభ్యర్థులు వాటి ఖర్చులను భరించాలని, అసెంబ్లీ స్థానాలకు వీటి ధరను 5 లక్షలుగా పరిమితి విధించాలని, అదే పార్లమెంటు స్థానాలకైతే పది లక్షల రూపాయల పరిమితిని విధించాలని కూడా ఉపాధ్యయ సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more