ఆర్కేనగర్ ఉప ఎన్నికకు పోటీ చేయడానికి సినీనటుడు విశాల్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ నామినేషన్ లో తప్పులు ఉండడంతో తిరస్కరిస్తున్నామని చెప్పిన రిటర్నింగ్ అధికారి.. విశాల్ ధర్నాకు దిగిన అనంతరం మళ్లీ స్వీకరిస్తున్నామని తెలిపారు. మరికాసేపటికే మళ్లీ తిరస్కరిస్తున్నామని తెలిపి షాక్ ఇచ్చారు. హైడ్రామా కొనసాగిన నేపథ్యంలో సదరు అధికారి వేలుస్వామిపై వేటు పడింది.
ఆ అధికారిపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త రిటర్నింగ్ అధికారిగా ఐఏఎస్ ప్రవీణ్ పి.నాయర్ నియమితులయ్యారు. విశాల్ నామినేషన్ పత్రాలను తిరస్కరించిన ఆ అధికారిని ఎన్నికల సంఘం వెనక్కి పిలిచింది. కాగా, ఎన్నికల అధికారులు అధికార అన్నాడీఎంకే పక్షానికి సానుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more