ఓ మాజీ సైనికుడు చేతిలో తుపాకి వుందికదా అని రెచ్చిపోతే ప్రజలకు ఎంతో నష్టం. అలాంటి ఘటనకే పాల్పడిన ఓ మాజీ సైనికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేతిలో అయుధం వుంది కదా అని తన పెంపుడు కుక్కను గొలుసుతో కట్టేసి కాల్చి చంపాడు మీ కసాయి. చేసింది సరిహద్దులో సిపాయి ఉద్యోగం అయినా.. ఈయన చేసిన ఈ దారుణ ఘటనతో నెట్ జనులు కసాయి అని.. కనికరమే లేదా..? అసలు మనిషివేనా అంటూ ఈడడించుకుంటున్నారు.
ఈ ఘటన పంజాబ్లోని బర్నాలా జిల్లా బాద్బార్ గ్రామంలో చోటుచేసుకుంది. ఇండియన్ అర్మీలో సేవలందించిన అజిత్ సింగ్ పంజాబ్ లోని బర్నాలా జిల్లా బాద్బార్ గ్రామానికి చెందినవాడు. తన మిత్రుడైన సత్వీర్ సింగ్ తో కలిసి అజిత్ సింగ్ తన ఇంట్లో ముద్దుగా పెంచుకుంటున్న శునకాన్ని అత్యంత దారుణంగా హత్యమార్చాడు. రోడ్డుపైన అందరూ చూస్తుండగానే కుక్క మెడకు గొలుసును కట్టి అది పారిపోకుండా చేసి దానిని కాల్చి దారుణంగా హతమార్చాడు.
ఈ ఘటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ సైనికుడి కుమారుడు.. తన తండ్రి చేస్తున్న అమానవీయ చర్యను అడ్డుకునేందుకు, ఈ సన్నివేశాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇది కాస్తా నెట్టింట్లో సంచలనంగా మారింది. మాజీ సైనికుడి దారుణంపై నెట్ జనులు తీవ్రంగా స్పందించారు. జంతు ప్రేమికులు తీవ్ర మనస్థాపానికి గురిచేసిన ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి. జంతు హక్కుల సంస్థ.. వారిపై చర్యలను తీసుకోవాలని కేంద్రమంత్రి మనేకా గాంధీ, పంజాబ్ డీజీపీలకు లేఖ రాశారు.
రంగంలోకి దిగిన పోలీసులు వారిపై జంతు హింస కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బెయిల్పై బయటకు వచ్చిన మాజీ సైనికుడు అజిత్ సింగ్ మాట్లాడుతూ.. నా పెంపుడు కుక్కకు ర్యాబీస్ వ్యాధి సోకింది.. ఈ కుక్క తన రెండు గేదెలను, చాలా మంది ప్రజలను కరిచింది అందుకే చంపానని ఆయన పోలీసులకు తెలిపారు. చాలా ప్రేమతో ఆ కుక్కను నేను పెంచుకున్నాను. అలాంటిది నేనే ఎందుకు చంపుకుంటానని మాజీ సైనికుడు చెప్పారు. కుక్క అవయావాలను టెస్టు నిమిత్తం డాక్టర్ ల్యాబ్ కు పంపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more