తన పరువుకు భంగం కలిగించి.. తన ప్రతిష్టకు దెబ్బతీసేలా తప్పుడు వార్త ప్రచురించిన ‘ది వైర్’ అనే వెబ్ సైట్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జే షా వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ప్రకటించినట్లుగానే తప్పుడు కథనం ప్రచురించిందన్న అభియోగాలను మోపుతూ సదరు సంస్థపై పరువునష్టం దావా వేశారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఫైలింగ్స్ ను ఉంటంకిస్తూ వెబ్ సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ కథనం నేపథ్యంలో విపక్షాలు రంగంలోకి దిగాయి. ముఖ్యంగా ఆప్, కాంగ్రెస్ పార్టీలు 'జే' సంస్థపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశాయి.
జే డైరెక్టర్ గా ఉన్న టెంపుల్ ఎంటర్ ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ టర్నోవరు 2014-15లో రూ.15 వేలు ఉండగా 2015-16 నాటికి అది ఏకంగా 16 వేల రెట్లు పెరిగి రూ.80.5 కోట్లకు చేరుకుందని కథనంలో పేర్కొంది. రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నాథ్వాని బంధువైన రాజేష్ ఖండ్వాలా నుంచి కంపెనీకి రూ.15.78 కోట్ల రుణం అందిందని, ఖండ్వాలా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా కూడా ఉన్నారని పేర్కొంది. ఈ కథనాన్ని ఆధారంగా చేసుకుని రంగంలోకి దిగిన విపక్షాలు జే కంపెనీపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశాయి.
దీంతో స్పందించిన జే ఆ వార్త పూర్తిగా వాస్తవ విరుద్ధమని పేర్కొన్నారు. తన కంపెనీలో ఎటువంటి అవకతవకలు జరగలేదని వివరణ ఇచ్చారు. తనను అప్రతిష్ఠ పాలు చేసే ఉద్దేశంతోనే వార్త ప్రచురించారని ఆరోపించారు. తన వ్యాపారం విజయవంతం కావడం వెనక తన తండ్రి రాజకీయ పలుకుబడి ఉందనే అపోహలకు తావిచ్చేలా ఉందని పేర్కొన్నారు. నిబంధనలకు అనుగుణంగానే తాను వ్యాపారం చేస్తున్నానని, ట్యాక్స్ రికార్డులు, బ్యాంకు లావాదేవీలు అన్నీ పారదర్శకంగా ఉన్నాయని పేర్కొన్నారు.
కాగా, జే షా నిర్వహిస్తున్న కంపెనీ టర్నోవర్ ఒక్కసారిగా రూ.80.5 కోట్లకు చేరుకున్నట్టు వార్తలు రావడంతో కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ స్పందించారు. అధికారం వచ్చిన తర్వాత కొందరి అదృష్టం మారిపోతుంటుందని వ్యాఖ్యానించారు. ఇవే ఆరోపణలు ప్రతిపక్షంపై వస్తే అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం ఉవ్విళ్లూరుతుంటుందని అన్నారు. ప్రధాన మంత్రి నిత్యం వల్లేవేసే విధంగా తాను నిజమైన అవినీతి వ్యతిరేక వ్యక్తి అయితే.. అవినీతిని సహించని నేత అయితే తక్షణం జై సంస్థపై సిబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఏ స్టాక్ లేని సంస్థ, ఏ నిల్వలు లేని పరిశ్రమ, ఇన్వెంటరీలు, అస్తులు లేని ఎంటర్ ప్రైజ్ ఒక్క ఏడాదిలో ఏకంగా రూ.80 కోట్ల రూపాయల లాభాన్ని ఎలా అర్జిస్తుందని కపిల్ సిబాల్ ప్రశ్నించారు. ఇది కూడా క్రోనీ కాపిటలిజమని దుయ్యబట్టారు. దేశంలో విపక్ష పార్టీలపై వచ్చే అరోఫణల నేపథ్యంలో తక్షణం స్పందించే ప్రధాని మోదీ ఈ అరోపణలపై కూడా స్పందిస్తారా..? సిబిఐ విచారణ జరిపిస్తారా..? అరెస్టులు చేయిస్తారా..? అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీ అవినీతి కేసుల్లో మరోటి చేరిందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more