చట్టసభలకు ఎన్నికైనంత మాత్రాన విజ్ఞత మర్చిప్రవర్తిస్తున్నారు ప్రజా ప్రతినిధులు.. ఓ ప్రజాప్రతినిధి తాను ఎక్కడి వెళ్లిన తాను చేసే అభివృద్ది పనులకు ప్రచారం చేసుకోవడం కన్నా.. తన అభిమానులు, కార్యకర్తలపై చేయి చేసుకునే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇక తాజాగా మరో ఎమ్మెల్సీ కూడా ఇలాంటి దారుణానికే ఒడిగట్టారు. తాను నివాసముంటున్న ఇంటిని ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటి ఎదుట అందోళనకు దిగిన మహిళపై జులుం చేశారు.
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కావడంతో.. తాను చెప్పిందే రాజ్యం.. చేసిందే శాసనం అన్న రీతిలో వ్యవహరిస్తూ.. సదరు మహిళను తన దిక్కున్న చోట చెప్పుకోవాల్సిందని అమెపై బెదిరింపులకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ నాంపల్లిలోని ఓ ఫ్లాటులో అద్దెకు వుంటున్నారు. శాసనమండలి సహా సెక్రటేరియట్ మిగతా అన్ని ప్రాంతాలు నిమిషాల వ్యవధిలోనే వెళ్లి వచ్చేందుకు వీలుగా ఎన్నారై దంపతులకు చెందిన ఇంటికి అద్దెకు తీసుకున్నారు.
గత కొన్నేళ్లుగా అక్కడే వుంటున్న హుస్సేను కుటుంబాన్ని ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా సదరు ఎన్నారై మహిళ గత రెండేళ్లుగా ఫోన్ ద్వారా కోరుతూ వస్తుంది. అయితే దానిని పెడచెవిన పెట్టిన ఎమ్మెల్సీ.. అంతగా పట్టించుకోకకుండా పలు కారణాలు చెబుతూ వచ్చారు. దీంతో తన ఇంటిని ఖాళీ చేయమంటే కాలయాపనలో కాలాన్ని వెల్లబుచ్చుతున్న నేపత్యంలో ఇంటి యజమానురాలు ఏకంగా హైదరాబాద్ కు వచ్చింది. తాజ్ హోటల్ లో బస చేస్తూ.. గత మూడు రోజులుగా ఎమ్మెల్సీ ఇంటికి వెళ్లి ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా కోరుతుంది.
ఇవాళ్ల ఉదయం కూడా తన బంధువులను వెంటబెట్టుకుని.. ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సెన్ ఇంటికి వెళ్లింది. ఇళ్లు తక్షణం ఖాళీ చేయాలంటూ కోరింది. అయినా అయన పట్టించుకోకపోవడంతో ఇంటి ఎదుట అందోళనకు దిగింది. దీంతో ఇంట్లోకి రమ్మని కూర్చోబెట్టి మాట్లాడుకుందామని చెప్పిన ఎమ్మెల్సీ.. మాటల మధ్యలో అకస్మాత్తుగా అమెపై చెప్పు తీసుకుని చెంప చెల్లుమనిపించారు. ఈ ఘటనను అమె బంధువులు సెల్ ఫోన్లలో రికార్డు చేశారు. ఇల్లు ఖాళీ చేయమని కోరినందుకు ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ అత్యంత హేయకరైన చర్యకు పాల్పడ్డారని వారు అరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more