ఉత్తర్ ప్రదేశ్ లో ఇవాళ వేకువజామున మరో ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురయ్యింది. అయితే ప్రయాణికులెవ్వరికీ ఏలాంటి గాయాలు కాకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇవాళ ఉధయం జబల్ పూర్ నుంచి హౌరాకు వెళ్తున్న శక్తిపుంజ్ ఎక్స్ ప్రెస్ రైలు సోన్ భద్ర జిల్లాలోని ఒబరా రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురైంది. వరుస ప్రమాదాలకు నిలయంగా మారిన ఉత్తర ప్రదేశ్ లోనే ఈ ఘటన చోటుచేసుకోగా, ఈ ఘటనపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
కాగా, ఈ ప్రమాదంలో శక్తికుంజ్ ఎక్స్ ప్రెస్ రైలుకు సంబంధించి ఏడు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు చెబుతున్నారు. అయితే ఒక్కరిద్దరికీ గాయాలైనా అవి స్వల్పగాయాలని అధికారులు చెబుతున్నారు. కాగా ఈ ప్రమాదానికి రైలు పట్టా విరిగిపోయి ఉండటమే కారణంగా అనుమానిస్తున్న అధికారులు ఈ ప్రమాదంలో సంఘవ్యతిరేక శక్తుల హస్తం వుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు పూరైన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు.
కాగా ప్రయాణికులందరినీ సురక్షితంగా ఇతర బోగీల్లలో కూర్చునే సదుపాయాన్ని కల్పించి.. ఇవాళ ఉదయం 7.28 గంటలకు రైలు నిర్ధేశిత ప్రాంతానికి తరలించామని అధికారులు తెలిపారు. అయితే ప్రమాదం సంభవించిన సమయంలో రైలు కేవలం గంటలకు 40 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తున్నందున ప్రమాదంలో పెద్దగా ఎవరికీ గాయాలు కాలేదని రైల్వే అధికారులు రైల్వే శాఖ అధికార ప్రతినిధి అనీల్ సక్సెనా తెలిపారు. కాగా రైలు ప్రమాదంపై రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ కు కూడా సమాచారం అందించామని అయన చెప్పారు.
గత నెల నుంచి వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు ప్రయాణికులను అందోళనకు గురిచేస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో ఈ తరహా ఘటనలు చోటుచేసుకోవడం ఇది ఐదోవసారి. గత నెలలో 19న హరిద్వార్ నుంచి ఉత్తరాఖండ్ కు వెళ్తున్న కలింగా ఉత్కల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురై ఏకంగా 23 మంది ప్రాణాలను బలితీసుకుంది. అంతకుముందు ముంబై లోని లోకల్ రైలు కూడా పట్టాలు తప్పిగా ఈ ప్రమాదంలో కూడా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
ఇక గత నెల 23న ఖియాఫత్ ఎక్స్ ప్రెస్ రైలు ఉత్తర్ ప్రదేశ్ లో పట్టాలు తప్పడంతో 50 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఆ తరువాత గత నెల 29 ముంబై నుంచి వెళ్తున్న దురంతో ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. అయితే ఈ ఘటనలో కూడా రైలు నిదానంగా వెళ్తుండడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇక తాజాగా శక్తికుంజ్ రైలు పట్టాలు తప్పింది. ఈ వరుస ప్రమాదాల నేపథ్యంలోనే కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తన పదవికి రాజీనామా చేయగా, రైల్వేశాఖను మరో మంత్రి పీయూష్ గోయల్ కు ప్రదాని అప్పగించారు. అయితే పీయూష్ గోయల్ బాధ్యతలు చేపట్టాక జరిగిన తొలి ప్రమాదం ఇదే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more