చట్టాలు చేసే వాళ్లం.. మాకు చట్టాలన్నీ చుట్టాలే.. సాధారణ ప్రజానికం వేరు మేము వేరు అంటూ అనేక చిత్రాలో చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిదులు వెలువరించే డైలాగులకు ఇక బ్రేక్ పడనుంది. గత యూపిఏ ప్రభుత్వ హాయంలో దోషులుగా తేలి శిక్ష అనుభవించిన నేతలు మళ్లీ రాజకీయాల్లో వచ్చేలా రూపోందించిన బిల్లును ఆ పార్టీ యువనేత రాహుల్ గాందీ విమర్శించడంతో రమారమి చట్టబద్దత సాధించిన అంశాన్ని అటెక్కకించేసింది మన్మోహన్ సింగ్ సర్కార్.
అయితే అసలు నేర చరిత్ర కలిగిన ప్రజా ప్రతినిధులను రాజకీయాల్లోని శాశ్వతంగా రానీయకుండా.. వారిపై జీవితకాలం వేటు వేయాలన్నది ఓ కాషాయ నేత అలోచన. దీంతో ఇక రాజకీయాల్లోకి రావాలని చట్టసభలకు ఎన్నిక కావాలి అంటే కండస్టు సర్టిఫికేట్ మాదిరిగా నేర చరిత్ర వుండకూడదన్న కొత్త నిబంధన వుండాలన్నది అతని అభిమతం. స్వతంత్ర్య భారతావనిలో గత 70 ఏళ్లుగా నేరచరిత్ర కూడా అదనపు అర్హతగా భావించి రాజకీయ అరంగ్రేటం చేస్తున్నావారికి చెక్ పెట్టలాని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో నేటి నుంచి వాదనలు జరగనున్నాయి. ఆ నేత పేరే.. అశ్వని ఉపాధ్యాయ
ఏదైనా నేరంలో ఛార్జీషీట్ నమోదై జైలుకు వెళ్లి వచ్చిన చట్టసభల ప్రతినిధులు (ఎమ్మెల్యే, ఎంపీ తదితరులు)పై వున్న ఆరేళ్ల నిషేధం స్థానంలో వారిపై జీవిత కాలం వేటు వేయాలని.. రాజకీయాలకు వారిని అనర్హులుగా చేయాలని అశ్వినీ ఉపాధ్యయ పిటీషన్ దాఖలు చేశారు. ఇవాళ ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. కాగా, ఇదే పిటిషన్ గత వాదనల సందర్భంగా శిక్ష అనుభవించిన నేతల విషయంలో స్పష్టమైన విధానాలు లేకుండా అవలంభిస్తున్నారంటూ ఎన్నికల కమిషన్ పై సుప్రీం సీరియస్ అయ్యింది.
అలాగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హత, వయో పరిమితి విధించాలంటూ కేంద్ర ఎన్నికల కమీషన్ తోపాటు కేంద్రానికి కూడా అత్యున్నత న్యాయస్థానం సిఫార్సు చేసింది. నేర చరిత్ర ఉన్న నేతలు రాజకీయాల్లో కొనసాగటం సబబు కాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తూనే.. వారిపై జీవిత కాల నిషేధానికి మాత్రం ఎన్నికల సంఘం వెనకంజ వేయటం చర్చనీయాంశంగా మారింది. కేంద్రం కూడా ఆర్టికల్ 14 ప్రకారం నేరచరిత నేతలపై బ్యాన్ సబబు కాదని ఇప్పటికే సుప్రీంకోర్టుకు ఓ నివేదికను సమర్పించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more