దేశం తరపున ప్రయోగించబడిన తొలి ఉపగ్రహం ఆర్యభట్ట వెనుక ఉన్న మేధావి, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మాజీ చీఫ్ ప్రొఫెసర్ యూఆర్ రావు (85) ఇకలేడు. బెంగళూరు లో సోమవారం వేకువఝామున 3గంటలకు ఆయన కన్నుమూసినట్లు ఇస్రో పీఆర్ డీ దేవీప్రసాద్ కర్నిక్ మీడియాకు వెల్లడించాడు. 85 ఏళ్ల రావు గత కొంత కాలంగా హృద్యోగ(గుండె) సమస్యతో బాధపడుతున్నాడు.
ఉడిపిలోని అదంపూర్లో జన్మించాడు ఉడిపి రామచంద్రరావు అలియాస్ యూఆర్ రావు. ఆర్యభట్ట నుంచి మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రాజెక్టు వరకు ఆయన పనిచేశారు. ఇస్రో చైర్మన్గా పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపట్టారు. ముఖ్యంగా 1984-94 మధ్య ఆయన సేవలు చాలా కీలకంగా మారాయి. 2013 లో వాషింగ్టన్ లో నిర్వహించిన శాటిలైట్ హాల్ హాఫ్ ఫేమ్ లో ఆయన పేరు నమోదు చేశారు. భారత దేశ తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగంలో ఆయనే ముఖ్యభూమిక పోషించాడు. చంద్రయాన్-1, మంగళయాన్ లకు కూడా ఆయన సలహాలు అందిస్తూ వస్తున్నారు.
రావు గతంలో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబరేటొరీ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్గా, తిరువనంతపురంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాన్స్లర్గానూ సేవలందించారు. అంతేకాదు, పలు ఉన్నత పదవులు నిర్వహించారు. విదేశీ యూనివర్శిటీల్లోనూ ఆయన పనిచేశారు. పది అంతర్జాతీయ అవార్డులు, మరెన్నో జాతీయ అవార్డులు అందుకున్నారు. 1976 లో ఆయనకు పద్మభూషణ రాగా, ఈ జనవరిలో రావుకు ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించింది. అయితే ఆ గౌరవాన్ని తాను మరణానంతరం అందుకుంటానని ఆయన చెప్పడం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more