మెడికల్ కాలేజీకి భారతీయ మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతి ఇప్పించేందుకు తమ పార్టీ నేత భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్నాడని వ్యవహరం వెలుగుచూడటంతో బీజేపి నేతలు నీతివంత పాలన మార్కుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేరళలోని ఓ మెడికల్ కాలేజీ యాజమాన్యం నుంచి భారీ మొత్తంలో ముడుపులు తీసుకుని ఎంసీఐ నుంచి అనుమతి ఇప్పిస్తానని విపక్షాలు అరోపించడమే కాదు స్వయంగా బీజేపి దర్యాప్తు బృందం కూడా ఈ విషయాన్ని నిగ్గుతేల్చింది. అంతేకాదు విచారణ సందర్బంగా ఆ రాష్ట్ర బీజేపీ కోఆపరేటివ్ సెల్ కన్వీనర్ ఆర్ఎస్ వినోద్ అంగీకరించినట్లు తెలిసింది.
అయితే ఈ విషయంలో సీబిఐ దర్యాప్తు చేయిస్తే నీతివంత పాలన అని చెప్పుకుంటున్న ప్రభత్వం వెనకనున్న అవినీతిపరులు గుట్టు రట్టు అవుతుందని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మెడికల్ కాలేజీకి అనుముల వ్యవహారంలో దేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడ, ఎన్ని కాలాశాలలకు అనుమతులు మంజూరుకు ఎన్నెన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయో అని అనుమానాలను వ్యక్తం చేసిన విపక్ష సభ్యులు అవ్ని వివరాలు వెలుగుచూసేందుకు సిబిఐ విచారణ చేయించాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల డిమాండ్ చేస్తున్నారు.
ఇక ఈ తరహా వ్యవహారంలో ఆ రాష్ట్ర బీజేపి చీఫ్ కుమ్మనం రాజశేఖర్ ద్విసభ్య కమిటీని వేసి విచారించి వారిపై పార్టీపరమైన చర్యలు తీసుకుని సరిపెట్టే ఉద్దేశ్యం కనబడుతుందని, అలా కాకుండా మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని, అసలు దేశవ్యాప్తంగా ఎన్ని కాలేజీలకు అనుమతులు లభించాయి, ఎన్ని దరఖాస్తు చేసుకున్నాయి.. అన్న లెక్కలు చూసి విచారణ సాగించాలని అందుకనే తాము సీబిఐ విచారణను డిిమాండ్ చేస్తున్నామని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాలేజీలకు అనుమతి ఇప్పించేందుకు ఏకంగా రూ.5.6 కోట్లను తీసుకోవడంపై విచారణ జరగాల్సిందేనన్నాయి.
అవినీతి రహిత పాలన అందిస్తున్నామని తమ సర్కారుపై తామే గొప్పులు చెప్పుకునే.. ప్రధాని నరేంద్రమోడీ.. తాను చెబుతున్న మాటలు నిజమని భావిస్తే.. మెడికల్ కాలేజీల వ్యవహారంలో మొత్తం ఎంసీఐకి వచ్చిన ధరఖాస్తులపై విచారణ జరిపించాలని ప్రత్యర్థి పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. వర్కలలోని ఎస్ఆర్ ఆస్పత్రికి మెడికల్ కాలేజీ హోదా కల్పించేందుకు బీజేపి నేత లంచం తీసుకోవడంతో ఇది ఇక్క అంశంలో మాత్రమే జరిగిన వ్యవహారంగా పరిగణించవద్దని, మొత్తంగా చూడాలని అందుకనే సీబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా ఈ వ్యవహారంతో బీజేపీ అసలు స్వరూపం బయటపడిందంటున్న ప్రతిపక్షాలు.. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more