ఏమైపోయిందోనంటూ 40 రోజుల పాటు కొనసాగిన సస్పెన్స్కు తెర పడింది. సంచలనం రేపిన పూర్ణిమ సాయి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. ముంబైలోని దాదర్ లో పూర్ణిమ సాయి ఉండటాన్ని అక్కడి ఓ స్వచ్ఛంద సంస్థ గుర్తించింది. ఈ విషయాన్ని సైబరాబాద్ పోలీసులకు తెలియజేయడంతో అక్కడికి వెళ్లారు. ఆ బాలిక పూర్ణిమే అని ధృవీకరణ కావటంతో ముంబై నుంచి హైదరాబాద్ కు తీసుకురానున్నారు.
కాగా, నిజాంపేటకు చెందిన పదమూడేళ్ల పూర్ణిమ సాయి గత నెల 7న స్కూల్కని వెళ్లి.. అదృశ్యమైంది. దీంతో, ఆ బాలిక తల్లిదండ్రులు తమ బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికారు. బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో, బాచుపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తొలుత, మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు,ఆ తర్వాత దీనిని కిడ్నాప్ కేసుగా మార్చారు. ఎలా చేరిందో తెలీదుగానీ బాలిక ముంబయిలోని బోయివాడ ఆశ్రమానికి చేరుకుంది.
అక్కడి పోలీసులకు, ఆశ్రమ నిర్వాహకులకు బాలిక తెలిపిన వివరాల ఆధారంగా.. అక్కడి ఎస్సై మహాజన్ ఆదివారం సాయం త్రం తుకారాంగేట్ సీఐ రమేష్కు ఫోన్చేసి వాట్సాఫ్లో బాలిక ఫొటో పంపించారు. అయి తే ఇప్పటికే ఈ విషయంలో పెద్ద ఎత్తున ఫ్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం జరగడంతో తుకారాంగేట్ సీఐ రమేష్ బాచుపల్లి సీఐ బాలకృష్ణారెడ్డికి సమాచారం అందించారు. ముంబయి నుంచి పంపిన ఫొటో , పూర్ణిమాసాయి ఫొటోతో సరిపోలడంతో అటు పోలీసులు, ఇటు పూర్ణిమాసాయి కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం పూర్ణిమా పుట్టినరోజు కావడంతో ఆమె తమకు మళ్లీ జన్మించినట్లుగా తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నా రు.
యాక్టింగ్ పిచ్చితో...
ఎలాగైనా నటించాలన్న ఉద్దేశంతోనే ఇంటి నుంచి పారిపోయినట్లు విస్తూ పోయే విషయాలు వెల్లడించింది బాలిక పూర్ణిమా సాయి. 40 రోజుల క్రితం ఇంట్లోంచి పారిపోయి 15 రోజులు ప్రయాణం చేసి ఆపై ముంబై చేరుకున్న పూర్ణిమ గుళ్లో ప్రసాదం తింటూ కాలం వెల్లదీసింది. ఆపై సినిమా, సీరియళ్ల అవకాశాల కోసం ముంబైలోని ఫిల్మ్ స్టూడియోల చుట్టూ కాళ్లరిగేలా తిరిగింది. తాను ఊహించిన దాని కన్నా భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని తెలుసుకున్న తరువాతనే పోలీసులను ఆశ్రయించానని, అయితే, ఎలాగైనా సినిమాల్లో నటించాలన్న బలమైన కోరికతోనే పోలీసులకు అబద్ధాలు చెప్పానని వెల్లడించింది.
తన తల్లిదండ్రులు కొద్ది రోజుల క్రితమే చనిపోయారని, తన పేరును ఓ సీరియళ్ లోని నటి పేరుతో మార్చుకుని పోలీసులను బురిడీ కొట్టించే యత్నం చేసింది. సినిమా స్టూడియోల ముందు తనను ఎవరూ పట్టించుకోలేదని పోలీసులకు తెలిపింది. తనకు ఎక్కడికీ వెళ్లాలని లేదని, ముంబైలోనే ఛాన్సుల కోసం ట్రై చేస్తానంటూ పోలీసులకు విన్నవించింది. ప్రస్తుతం బాలికకు కౌన్సిలింగ్ ఇప్పించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇక మనసులోని కోరికను తీర్చుకునే దిశగా అడుగులు వేసిన పూర్ణిమ రిస్క్ అయినా యత్నించిందని పలువురు అంటున్నారు. అక్రమ రవాణా ముఠాల కళ్లలో బాలిక పడకపోవటం అదృష్టమనే చెప్పుకోవాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more