స్వాతంత్ర్య సంగ్రామంలో తెల్లదొరలకు తన ఆజాద్ హింద్ ఫౌజ్ తో వెన్నులో వణుకు పుట్టించిన ధీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం ఇవాళ్టికీ మిస్టరిగానే వుంది. ఈ విషయంలో ఇప్పటికీ ఎన్నో అనుమానాలు.. వాదనలు తెరపైకి వచ్చాయి. ఆయన ఎలా మరణించారన్న విషయమై ఇంకా స్పష్టతమాత్రం రాలేదు. అయితే ఆయన విమాన ప్రమాదంలో మృతి చెందారని, లేదు మారువేషంలో భారత్లోనే జీవించారని.. ఇలా భిన్నమైన వాదనలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.
భారత ప్రభుత్వం.. నేతాజీ మృతిని ధ్రువీకరించేందుకు ఇప్పటివరకు మూడు కమిటీలు వేసింది. వాటిలో రెండు బోస్ విమాన ప్రమాదంలో మరణించారని తేల్చగా.. చివరగా 1999లో వేసిన ముఖర్జీ కమిషన్ మాత్రం దీనికి భిన్నమైన వాదనను వినిపించింది. బోస్ విమాన ప్రమాదంలో మరణించలేదని తేల్చింది. అయితే ఈ కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. అంతకుముందు వేసిన రెండు కమిటీలు జపాన్ ఆక్రమణలో ఉన్న తైపీలో 1945 ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని తేల్చాయి. ఇందుకు బ్రిటన్, జపాన్ దేశాలు ప్రకటనలే నిదర్శంగా చూపాయి.
తాజాగా పారిస్కు చెందిన జేబీబీ మోర్ అనే పరిశోధకుడు.. బోస్ విమాన ప్రమాదంలో మరణించలేదన్న వాదనను తెరపైకి తీసుకువచ్చారు. ఫ్రాన్స్ గూఢచర్య సంస్థకు సంబంధించిన ఓ నివేదికను ఇందుకు ఆధారంగా ఆయన చూపించారు. 1947, డిసెంబరు 11నాటి ఆ నివేదిక నేతాజీ ఇండో చైనా ప్రాంతం నుంచి పారిపోయారని.. అయితే ఆయన ఎక్కడ ఉన్నారన్న దానిపై సమాచారం లేదని పేర్కొందని మోర్ చెప్పారు. నేతాజీ మృతికి సంబంధించిన ప్రస్తావనే అందులో లేదని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more