రాష్ట్ర రాజకీయ దిగ్గజాలలో ఒకరైన అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనకు జరిగిన పరాభవంపై న్యాయపోరాటం చేసేందుకు సిద్దమయ్యారు. కేంద్రంలో మిత్రపక్ష బీజేపి అధికారంలో వున్నా.. రాష్ట్రంలో తాను గెలిచిన తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో వున్నా.. ఆయనకు జరగాల్సిన పరాభవం మాత్రం జరిగిపోయింది. దీంతో ప్రభుత్వాలను ఏమీ అనలేక.. సదరు శాఖను నిర్వహిస్తున్నది కూడా తన పార్టీకి చెందిన సహచరుడే అయినా.. అతడ్ని కూడా అశ్రయించలేక.. చివరకు న్యాయమేవ జయతే అంటూ కోర్టు మెట్లెక్కారు.
విశాఖపట్నం విమానాశ్రయంలో బోర్డింగ్ టికెట్ కోసం తాను అడుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో.. అసహనంతో వారిని నిలదీసినందుకు.. తాను దురుసుగా ప్రవర్తించానని ఇండిగో విమాన సిబ్బంది గగ్గొలు చేశారని ఆయన ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇండిగో విమాన సిబ్బంది మాత్రం తమను దివాకర్ రెడ్డి వెనకనుంది నెట్టివేశారని, అంతటితో అగకుండా తమ కార్యాలయ కౌంటర్ లోకి వచ్చి నానా హంగామా చేశారని తెలిపారు.
ఇండిగో సిబ్బంది పట్ల దివాకర్ రెడ్డి దురుసుగా వ్యవహరించిన నేపథ్యంలో, ఆయనపై 8 విమానయాన సంస్థలు నిషేధం విధించాయి. దీంతో ఆయన న్యాయం కోసం కొర్టులను అశ్రయించారు. తనపై ఎయిర్ లైన్స్ సంస్థలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కేసును మరో బెంచ్ కు బదిలీ చేయాలని ఆదేశించింది. దీంతో బదిలీ అయిన తరువాత తదుపరి విచారణ జరగనుంది. ఇదిలావుండగా ఈ వివాదాన్ని వెంటనే పరిష్కరించుకోవాలంటూ జేసీకి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more