ఓవైపు వాళ్ల కోసమే మనం, చైనా సరిహద్దులో వాదులాడుకుంటుంటే భూటాన్ మాత్రం ఇప్పటిదాకా మౌనంగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సరిహద్దులో రోడ్డు నిర్మాణంతో మొదలైన గొడవ, భూటాన్ భారత్ ను సాయం కోరటం, మనం రంగంలోకి దిగి వాళ్లకు మద్ధతుగా నిలివటం తదితర పరిణామాలు చకచకా జరిగిపోయాయి. సమస్య పరిష్కారం కావాలంటే భారత్తో సంబంధాలు తెంచుకోవాలంటూ చైనా ఇచ్చిన ఆఫర్ను భూటాన్ తిరస్కరించింది. చైనాతో రాజీకి సిద్ధపడి, భారత్తో సంబంధాలను తెంచుకోవడానికి ఇష్టపడడం లేదు.
భారత్ విషయంలో ఎందుకు భూటాన్ వ్యూహాత్మక మౌనం పాటిస్తుందన్న అంశాన్ని విశ్లేషిస్తే, మనతో ఆ దేశానికి ఉన్న సంబంధాలు అలాంటివి మరి అని చెబుతున్నారు. డోక్లాంలో చైనా నుంచి ప్రమాదం ఉండడంతో భారత్ను భూటాన్ విడిచిపెట్టే ప్రసక్తే లేదని భూటాన్ నిపుణుడు ఒకరు చెబుతున్నారు. డోక్లాం సహా వివాదాస్పద ప్రాంతాన్ని చైనా తనదిగా చెప్పుకుంటే హా, పారో, థింఫు లోయలు చైనా ఫిరంగుల లక్ష్యంలోకి వచ్చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
అంతేకాదు రాజధాని థింఫుకు దారితీసే రాజధానిని చైనా ధ్వంసం చేసే ప్రమాదం ఉందని ఆయన వివరించారు. ఫలితంగా భారత్ నుంచి ఆహార సరఫరాకు ఉన్న ఒకే ఒక మార్గం మూతపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు భూటాన్లోని 495 చదరపు కిలోమీటర్లు, పశ్చిమ సెక్టార్లోని 286 చదరపు కిలోమీటర్లు తమవేనని చైనా వాదిస్తోంది. అయితే డోక్లాంను కనుక తమకు ఇచ్చేస్తే తూర్పు భూటాన్ను వదులుకోవడానికి తాము సిద్ధమని చైనా ఆఫర్ ఇచ్చింది. అదే జరిగితే చైనాకు భారత్పై ఆధిపత్యం చలాయించే అవకాశం లభిస్తుంది.
కానీ, చైనా ప్రతిపాదనను భూటాన్ అంగీకరించేందుకు సిద్ధంగా లేదు. ఒకవేళ డోక్లాంను కనుక చైనాకు అప్పగిస్తే ఆ దేశ దళాలు తమ దేశంలోని మరో ప్రాంతంలోకి చొరబడతాయని భూటాన్ భావిస్తోంది. ఇది మరింత ప్రమాదకరం కావడంతో భారత్ వైపే లిటిల్ డ్రాగన్ కంట్రీ మొగ్గుచూపుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more