ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్పీసీ ప్లీనరీ మొదలైపోయింది. దివంగత వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళులర్పించి మరీ జగన్ అమరావతికి బయలుదేరాడు. గుంటూరు-విజయవాడ హైవేపై నాగార్జున యూనివర్శిటీ ఎదుట ఉన్న మైదానంలో వైసీపీ ప్లీనరీ జరుగుతోంది. ఈ ప్లీనరీకి ఏర్పాట్లు భారీగా చేశారు. ప్లీనరీలోని వేదికను జర్మనీ టెక్నాలజీతో నిర్మించటం విశేషం.
కేవలం అధికార దాహంతోనే అమలు కానీ లక్ష్యాలను చేయలేని హామీలను ఇచ్చి టీడీపీ అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీ నేత భూమాన కరుణాకర్ రెడ్డి విమర్శించాడు. ఆ పార్టీని ఎండగడుతూ, ప్రజల పక్షాన తమ వైసీపీ పోరాడుతోందన్నాడు. ప్రజల సంక్షేమం కోసం వైసీపీ ఎంత నిబద్ధతతో ఉందో, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తమ పార్టీ ఎంత కృత నిశ్చయంతో ఉందో ప్లీనరీలో చెబుతామని అన్నారు. టీడీపీది వంటావార్పుల ప్లీనరీ అయితే, తమది మాత్రం ప్రజల ఆశయసాధనకు కృషి చేసే ప్లీనరీ అని చెప్పారు.
ప్లీనరీలో 18 కీలక అంశాలపై చర్చించనున్నట్లు, రాబోయే రెండేళ్లలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తామని వెల్లడించాడు. ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని అన్నారు. వీటన్నింటిపై గత మూడేళ్లుగా తమ పార్టీ పోరాటం చేస్తోందని, దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని తెలిపాడు. మరోవైపు వచ్చే ఏడాది మొదటి నుంచి జగన్ నిరవధిక పాదయాత్రకు సిద్ధమైపోతున్నాడని సమాచారం అందుతోంది. 8 నెలలు రాష్ట్రం మొత్తం పర్యటించి ప్రజలకు చేరువవ్వాలనే ఆలోచనలో ఉన్నాడంట. ఈ మేరకు ప్లీనరీలో తీర్మానం చేసే అవకాశం ఉన్నట్లు టాక్.
ప్లీనరీ స్పెషాలిటీస్...
వేదిక ఎదుట పదివేల మందికి పైగా కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. నేతలకు, మీడియాకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. వర్షం పడినా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు.
ప్లీనరీకి తరలి వస్తున్న నేతలు, కార్యకర్తలను ఆకట్టుకునేలా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. పొట్టి శ్రీరాములు, పల్నాటి బ్రహ్మనాయుడు, వంగవీటి మోహనరంగా, కూచిపూడి నృత్యకారులతో పాటు పలువురు నేతల పేర్లతో స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు.
వేదిక వద్ద వైయస్ రాజశేఖరరెడ్డి నిలువెత్తు విగ్రహాన్ని ఉంచారు. అంతే కాకుండా వేదిక ముందు అనేక వైయస్ విగ్రహాలను ఉంచారు. జగన్ కు స్వాగతం పలుకుతూ పలు ఫ్లెక్సీలను కట్టారు.
నాయకులకు, కార్యకర్తలకు వేర్వేరుగా భోజన వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ నేతలతో కలసి కూర్చొని జగన్ భోజనం చేసేలా ఏర్పాట్లు జరిగాయి. మొత్తం 30 వేల మంది వస్తారని భావిస్తుండగా, సుమారు 5 వేల మంది ఒకేసారి భోజనం చేసేలా ఏర్పాటు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more