మానవసేవే మాధవ సేవ అన్న నానుడిని ప్రసిద్ది షిరీడీ సంస్థాన్ ట్రస్టు ఫాలో అవుతుంది. షరిడీ సాయినాధుడు చెప్పిన సూక్తులకు అనుగూణంగా తమ కార్యచరణను అమలుచేస్తుంది. షిరిడీలో విఐపీ అనే మాటకు కొంతకాలం వరకు దూరంగా వున్న ట్రస్టు.. వీఐపి, వీవిఐపీ దర్శనాలను, హరతి టిక్కెట్లను విక్రయించి తిరుమల తిరుపతి దేవస్థానం మార్గాన్ని ఫాలో అయ్యింది. అదేమార్గంలో భక్తులకు క్యాంటిన్లు, ఉచిత బోజనం, బస్సు రవాణా లాంటి సదుపాయాలను కూడా కల్పించింది. ఆదాయాన్ని సమకూర్చుకుంటున్న నేపథ్యంలో షిరిడి సంస్థాన్ ఒక్కసారిగా సాయినాథుడి సూక్తులు గుర్తుకువచ్చినట్లు వున్నాయి.
దీంతో అటు సాధారణ వీఐపీ టిక్కెట్లతో పాటు మరో కొత్త తరహా విఐపీ ట్రీట్ మెంట్ కు కూడా సంస్థాన్ నిర్వాహకులు అందుబాటులోకి తీసుకువచ్చారు. అవునండీ ఈ వీఐపీ కోటా అందరికీ మాత్రం కాదండీ.. సాయినాథుడి సూక్తులను అచరించే భక్తులకు మాత్రమే. దీంతో మీకు కూడా ఏం చక్కా వీఐపీలాగే షిర్డీ సాయినాధున్ని దర్శించుకునే అవకాశాన్ని షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కల్పిస్తోంది. ఇంతకీ సాయినాథుడి సూక్తులేంటీ అనేగా మీ ప్రశ్న. అక్కడికే వస్తున్నాం. మీరు చేయాల్సిందల్లా షిరిడీ సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిభిరంలో రక్తధానం చేయడమే.
షిర్డీ సాయినాధుని దర్శనానికి వెళ్లిన భక్తులు రక్తదానం చేయడం ద్వారా ఒక ఏడాది పాటు ఆలయంలో వీఐపీ హోదాలో దర్శనం ఉండటంతోపాటు సత్రాల్లో బస విషయంలో కూడా వీఐపీ తరహాలోనే సంస్థాన్ ఏర్పాటు చేస్తుంది. సర్వ మానవ శ్రేయస్సు కోసం ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ట్రస్టు చైర్మన్ సురేశ్ హారే మీడియాకు తెలిపారు. షిర్డీని బ్లడ్ బ్యాంక్ హబ్గా మార్చడం తమ ఉద్దేశమని చెప్పారు. ‘తిరుమల తిరుపతిలో తలనీలాలు సమర్పించినట్లే. షిర్డీకి వచ్చినవారు రక్తదానం చేయడం ఆనవాయితీగా మారుస్తాం’ అని ఆయన చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more