బీజేపీకి చెందిన హర్యానా మంత్రి అనిల్ విజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదానికి కులం, మతం, ప్రాంతమన్న విభేదాలు లేవని ఇన్నాళ్లు ప్రచారం చేసిన నేతలు.. తాజాగా మతాలను వర్గీకరిస్తూ ఉగ్రవాదంపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో అవి కాస్తా వివాదాస్పదమయ్యాయి. దేశంలో ఇప్పటివరకు జరిగిన ఉగ్రదాడుల్లో దోషులంతా ముస్లింలేనని, హిందూ ఉగ్రవాదమన్నది కేవలం మిథ్య అని వ్యాఖ్యానించారు. హిందువుగా పుట్టినవాడు ఉగ్రవాది కాబోడని కూడా అన్నారు.
ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఉగ్రవాదం విషయంలో కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ వైఖరిని తప్పబట్టారు. కేవలం ముస్లిం ఓటు బ్యాంకు కోసమే కాంగ్రెస్) హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని సృష్టించిందని అన్నారు. నిజానికి ఏ హిందువు ఉగ్రవాది కాడు.. కాబోడు. దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు జరిగిన దాడుల్లో దోషులు, నిందితులు అందరూ ముస్లింలే కదా?’ అని అనిల్ విజ్ అన్నారు.
ఇండియాపై దాడులు చేసిన ఎంతోమంది టెర్రరిస్టులను కాంగ్రెస్ హయాంలో విడిచిపెట్టారని, ఇప్పుడు వాళ్లంతా సమన్లను సైతం లెక్కచేయకుండా పాకిస్థాన్లో ఎంజాయ్ చేస్తున్నారని అనిల్ విజ్ మండిపడ్డారు. హిందూ ఉగ్రవాదం అన్నది నిజంగా ఉన్న పక్షంలో దేశం ఎప్పుడో నాశనమైయ్యేదని అన్నారు. కాగా మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఘాటుగా సమాధానమిచ్చారు.
సంఘ్ పరివార్ ఉగ్రవాద సంస్థే అన్న నిజాన్ని అనిల్ తన వ్యాఖ్యల ద్వారా మరోసారి నిరూపించారని దిగ్విజయ్ అన్నారు. ‘పరివార్ ఉగ్రవాద సంస్థని అనిల్ విజ్ అధికారికంగా ప్రకటించుకున్నారని అన్నారు. కాంగ్రెస్ చెబుతున్నది కూడా అదేనన్నారు. హిందువులు ఉగ్రవాదులు కారు.. సంఘ్ శక్తులు మాత్రమే టెర్రరిస్టులని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. కాగా హర్యానా మంత్రి అనీల్ విజ్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more