తెలుగు వార్తా ఛానెలల్లో సమగ్ర మార్పు తీసుకొచ్చిన టీవీ 9 ఛానెల్ అమ్మకానికి సిద్ధమౌతున్నట్లు సమాచారం. తెలుగు, కన్నడ, గుజరాతీ, మరాఠీ, ఆంగ్ల భాషల్లో వార్తా చానల్స్ నిర్వహిస్తున్న అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీఎల్) నుంచి మెజారిటీ వాటాలను విక్రయించేందుకు చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది. ప్రధానంగా నాలుగు మీడియా సంస్థలు టీవీ-9 బ్రాండ్ కోసం ఆసక్తిని చూపుతున్నాయని, మరో నెల రోజుల్లో చర్చలు పూర్తి కావచ్చని సమాచారం.
ప్రస్తుతం ఏబీసీఎల్ లోని 80 శాతం వాటాలు చింతలపాటి శ్రీనిరాజు ఆధ్వర్యంలో నడుస్తున్న పీపుల్ క్యాపిటల్ ఎల్ఎల్సీతో పాటు, యూఎస్ కు చెందిన పీఈ (ప్రైవేటు ఈక్విటీ) సంస్థ సైఫ్ పార్ట్ నర్స్ వద్ద ఉండగా, మిగతా వాటా సంస్థ సీఈఓ రవిప్రకాష్ తదితరుల వద్ద ఉంది. ఆర్థిక సేవలందిస్తున్న డెల్లాయిట్, కేపీఎంజీ, ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థలు ఏబీసీఎల్ విలువను లెక్కిస్తుండగా, జీటీవీ సహా మరో 3 మీడియా కంపెనీలు టీవీ-9 కోసం చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆర్థిక సంస్థల నివేదిక ప్రకారం, ఏబీసీఎల్ కోసం దాఖలయ్యే బిడ్ లో అత్యధిక ధరను కోట్ చేసిన కంపెనీకి అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ లో 80 శాతం వాటా దక్కనుంది. ఇక టీవీ-9 బ్రాండ్ విలువ రూ. 850 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల మధ్య ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఉద్యోగుల భద్రతకు వచ్చిన నష్టమేమి లేదని, వారిని యథాతథంగా కొనసాగించే ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం ఎమ్మెస్ వోలు తెలంగాణ వ్యాప్తంగా బ్యాన్ వేసిన సమయంలోనే అమ్మేస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. కానీ, ఇప్పుడు మాత్రం అది దాదాపు ఖాయం అయ్యిందనే సమాచారం అందుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more