ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. షెడ్యూల్డ్ తరగతులు(SC, ST), వెనుకబడిన వర్గాల(BC)వారిమంటూ నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదిస్తే వారికి ఉద్వాసన తప్పదని తెలిపింది. అంతేకాదు ఇప్పుడున్న కేంద్ర ఉద్యోగుల పూర్తి వివరాలు, వారి విద్యార్హత పత్రాలు సరైనవోకాదో తెలియజేయాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
వారిని కేంద్ర ప్రభుత్వం గట్టిగా హెచ్చరించింది. నకిలీ సర్టిఫికెట్లని తేలితే వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. సుమారు 1,800 మంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్టు ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన కేంద్రం దిద్దు బాటు చర్యలు చేపట్టింది. వీరిలో ఎక్కువ మంది బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల్లోనే ఉండటం గమనార్హం.
ఉద్యోగంలో చేరే సమయంలో నిబంధనల ప్రకారం తప్పుడు పత్రాలను సమర్పిస్తే వారిని ఉద్యోగంలోంచి తొలగించే అధికారం ఉంది అని డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ శాఖ తెలిపింది. ఈ విషయమై కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ స్పందిస్తూ1832 మంది ఇలా తప్పుడు మార్గాల్లో ఉద్యోగం సంపాదించినట్లు మార్చి 29న లోక్ భకు ఓ నివేదిక సమర్ఫించినట్లు తెలిపాడు.
వారిలో 276 మంది ని సస్పెండ్ చేయగా, 521 మంది పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, మిగతా 1,035 కేసుల్లో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉందంటూ వివరించాడు. ఎస్ బీఐ లో 157, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 135, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 112, సిండికేట్ బ్యాంకులో 103, న్యూ ఇండియా ఎస్సురెన్స్ అండ్ యూనైటెడ్ ఇండియా ఎస్సురెన్స్ లో 41 మందిని ఉన్నట్లు
సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more