దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఓ మాజీ జవాన్ భార్య రాసిన లేఖ కలకలం రేపింది. పాక్ పాల్పడుతున్న దుశ్చర్యలను చూస్తూ కూడా మీ 56 అంగుళాల ఛాతీ ఎలా ఊరుకుంటుందంటూ అందులో ఏకీపడేసింది. ఇండియన్ ఆర్మీలో 1991 నుంచి 2007 వరకు పని చేసిన మాజీ సైనికుడు ధరమ్ వీర్ సింగ్ భార్య సుమన్ సింగ్ ఈ పని చేసింది.
2014 సమయంలో ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే గనుక పాక్ ఇండియన్ సైనికులపై దాడి చేయాలంటే వణికిపోవాలంటూ ప్రగల్భాలు పలికారు. కానీ, ఇప్పుడు పరిస్థితి చాలా చెండాలంగా మారిపోయింది. దాడులు మరీ ఎక్కువ అయిపోయాయి. ‘ధైర్యానికి ప్రతీక అయిన మీ 56 అంగుళాల ఛాతి ఏమైంది? మన బలగాలపై పాకిస్థాన్ జరుపుతున్న దాడులను నివారించలేక పోతున్నారెందుకు? భారతవైపు పాక్ కన్నెత్తిచూసే సాహసం కూడా చేయకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కదా? ... ఇప్పుడేం జరుగుతోంది? పరిస్థితులు గతంలోకన్నా దారుణంగా మారాయి అంటూ అందులో పేర్కొంది.
ఇకనైనా ఆర్మీకి పూర్తి స్వేఛ్చనివ్వండి. వారే పాక్ ఆగడాల ఆటకట్టిస్తారు’ అంటూ తెలిపింది. 56 అంగుళాల జాకెట్ (బ్లౌజు) ను వేసుకోవాలని సూచిస్తూ లేఖతోపాటు ఫతేహాబాద్ లోని ‘జిల్లా సైనిక్ బోర్డు’ అధికారులకు అందజేసింది. ఇది దేశ ప్రధాని అవమానించినట్లు కాదా? అని భార్య చేసిన పనిపై మాజీ ఉద్యోగిని ప్రశ్నించగా.. మీరే చూస్తున్నారుగా.. జమ్ము లాంటి జవాన్లు రోజూ అవమానించబడుతున్నారు. చెంపదెబ్బళ్లు, రాళ్ల దాడులు.. ఇలా ఉంది పరిస్థితి. వీటిని ప్రభుత్వం ఏ మాత్రం అదుపు చేయలేకపోతుంది. అందుకే తన భార్య చేసిన ఈ పనికి పూర్తిగా మద్ధతు ఇస్తున్నానని తెలిపాడు. అయితే ధరమ్ సింగ్ ఆమ్ ఆద్మీకి జిల్లా పర్యవేక్షకుడిగా బాధ్యతలు నిర్వహించి, ఈ మధ్యే రాజీనామా చేయటం కొసమెరుపు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more