దేశంలో మహిళా భద్రత కోసం కేంద్రం కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ వారిపై అఘాయిత్యాలు మాత్రం అస్సలు ఆగటం లేదు. ఈ దశలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నేరాలు కట్టడి చేయటం కోసం షీ టీమ్స్ పేరుతో స్పెషల్ వింగ్ ను ఏర్పాటు చేశాడు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు. ఒంటిరిగా ఉన్న అమ్మాయిలను టార్గెట్ చేయటం, వారిని ఫాలో అయి టార్చర్ పెట్టడం.. ఇలాంటివి చేసిన సమయంలో షీ టీం ను సంప్రదిస్తే చాలూ మాటు వేసి మరీ కామాంధుల పని పడుతున్నారు.
అయితే వాళ్ల వలలో చిక్కుకుని మోసపోతున్న వారిలో ఐటీ కంపెనీల్లో పనిచేసే అమ్మాయిలే అధికంగా ఉన్నారని సైదరాబాద్ షీ టీమ్స్ విభాగం గణాంకాలతోసహా వెల్లడించింది. వారి బలహీనతలను ఉపయోగించుకుని ఆఫీస్సులో కోలీగ్స్, పై అధికారులు, బయటి నుంచి కొందరు వల వేస్తున్నారని, మాయమాటలను నమ్మి ఆకర్షణలో పడి ఆపై సర్వస్వం కోల్పోయి విలపిస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఒక్క ఏప్రిల్ నెలలోనే 86 మంది షీ టీమ్స్ ను ఆశ్రయించగా, వీరిలో సగానికి పైగా ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న వారే ఉండటం గమనార్హం.
మొత్తం 86 ఫిర్యాదుల్లో 22 కేసులు నమోదు చేసి 12 మందిని జైలుకు పంపామని, వీరిలో అత్యధికులు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నవారని తెలిపారు. 4 అత్యాచార కేసులు, 15 లైంగిక వేధింపుల కేసులు, మిగిలిన వారిపై పెట్టీ కేసులు పెట్టామని, 15 మందికి కౌన్సెలింగ్ ఇప్పించామని షీ టీమ్స్ ఇన్ చార్జ్ సలీమా వెల్లడించారు. హైదరాబాద్ లో 350కి పైగా సాఫ్ట్ వేర్ సంస్థలు ఉండటం, దాదాపు లక్ష మందికి పైగా అమ్మాయిలు పలు రాష్ట్రాల నుంచి వచ్చి పని చేస్తుండటంతో, వారి భద్రత నిమిత్తం అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, ఎప్పటికప్పుడు ఆకతాయిల ఆటలు కట్టిస్తున్నామని ఆమె చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more