సోషల్ మీడియాలో ఒక్కోసారి వైరల్ గా మారుతున్న కథనాలు అంతా ఫేక్ అని తేలుస్తుండడంతో అసలు ఏది నిజమైన వైరల్, ఏది పేక్ అన్నది తెలియక నెట్ జనులు అందోళనకు గురవుతున్నారు. బతికున్న రాజకీయా నాయకులపై కూడా అనవసర వార్తలు పెట్టి దానిని వైరల్ చేస్తూ.. నానా హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురిపై పోలీసులు చర్యలు తీసుకున్నా.. అనవసర అబద్దపు వార్తలను మాత్రం సోషల్ మీడియాలో పెట్టి నెట్ జనులను కంగారె పెట్టిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ వార్తా కథనమే వైరల్ గా మారింది.
ప్రముఖ యోగా గురువు, పతంజలి ఉత్పత్తుల అధినేత బాబా రాందేవ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారని.. తీవ్ర గాయాలపాలైన ఆయనకు మెరుగైన చికిత్సనందించేందుకు స్థానిక అస్పత్రికి తరలించినట్లు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదంలో పల్టీలు కొటిందని కూడా సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ప్రమాదంలో గాయపడిన బాబా రాందేవ్ ను స్ట్రెచర్ మీద తరలిస్తున్నట్టు ఉన్న ఈ ఫొటోలు ఫేస్బుక్, వాట్సాప్లలో షేర్ అవుతున్నాయి. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
అయితే, ఈ కథనాలు, ఫొటోలూ అన్నీ ఫేక్ అని తేలిపోయింది. బాబా రాందేవ్ సురక్షితంగా, క్షేమంగా వున్నారని తెలిసింది. హరిద్వార్ లో ఆయన వున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు నిజంకాదని కూడా తెలిసింది. ఫొటోమార్ఫింగ్ చేసిన ఫొటోలతో ఎవరో కావాలనే ఫేస్బుక్, వాట్సాప్లలో ఈ ప్రచారం చేస్తున్నట్టు ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. ఆయన కారు పల్టీలు కొట్టగా కారు టాప్ బాగంలోనే నుజ్జునుజ్జు అయ్యింది. ఇక ఆ కారుకు ముందుర ఎర్రని బోర్డులో ప్రభుత్వ వాహానం అని రాసివుంది. కాగా మరో ఫోలోటో బాబా రాందేవ్ ను అంబులెన్స్ లో అస్పత్రికి తరలిస్తున్న ఫోటో.. కూడా ఇన్ సర్ట్ చేసివుంది. అయితే బాబా రాందేవ్ అభిమానులు ఈ వదంతులను నమ్మవద్దని ఇవన్నీ ఫేక్ అని పతాంజలి సంస్థ వర్గాలు పేర్కోంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more