ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. సోమవారం సుక్మా ప్రాంతంలో సీఆర్ ఫీఎఫ్ దళాలను లక్ష్యంగా చేసి జరిపిన దాడిలో 25 మంది జవాన్లు మృతి చెందారు. కాల్పుల్లో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు సుక్మా అదనపు ఎస్పీ జితేంద్ర సుక్లా వెల్లడించాడు.
ఆ ప్రాంతంలో మావోయిస్టులు సంచారిస్తున్నరన్న పక్కా సమాచారంతో రిక్కీ నిర్వహించిన 74వ బెటాలియన్ కు చెందిన సీఆర్పీఎఎఫ్ దళంపై తుపాకులతో మావోలు విరుచుకుపడ్డారు. ముందు మావోలే కాల్పులు జరపటంతో ప్రతిగా జవాన్లు ఎదురు దాడికి దిగారని చెబుతున్నారు. అయితే మావోయిస్టుల సంఖ్య ఎక్కువగా ఉండటం, వాళ్లు అప్పటికే అప్రమత్తం అయ్యి ఉండటంతో తమ వైపే నష్టం ఎక్కువగా జరిగిందని అధికారులు తెలిపారు. సుమారు గంట పాటు జరిగిన ఎన్ కౌంటర్ లో జవాన్లను మట్టుపెట్టిన మావోలు వాళ్ల ఆయుధాలతోసహా ఉడాయించినట్లు తెలుస్తోంది.
సీఆర్ పీఎఫ్ జవాన్ల మృతిని బస్తర్ డీఐజీ సుందర్ రాజు ధ్రువీకరించారు. మరోవైపు బుర్కాపాల్-చింతాగుఫా ప్రాంతంలో ఏడుగురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందుతోందని చెప్పారు. ఘటన గురించి తెలియగానే ముఖ్యమంత్రి రమణ సింగ్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఈ యేడాది ఇదే జిల్లాలో ఇదే రీతిలో దాడి జరగ్గా 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే.
దెబ్బకు దెబ్బ తీసి తీరతాం...
చత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో ఈ రోజు సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల సంఖ్య 26కు చేరింది. ఈ దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. హోం శాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ అహిర్తో మాట్లాడి, ఛత్తీస్గఢ్ వెళ్లి పరిస్థితిని స్వయంగా సమీక్షించాలని ఆదేశించారు. 26 మంది జవాన్లు మృతి చెందడం జీర్ణించుకోలేకపోతున్నానని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. వారి కవ్వింపు చర్యలను సహిస్తూ ఉండాల్సిన అవసరం లేదని, దెబ్బకు దెబ్బ రుచి చూపించి తీరతాలని అధికారులతో ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇదే అంశంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ.. జవాన్ల ధైర్యానికి, త్యాగానికి సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more