హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లే వినియోగదారులను కేంద్ర ప్రభుత్వం కాస్త కరుణించింది. టిమ్స్ రూపంలో కస్టమర్లు ఇచ్చే పారితోషకాన్ని సర్వీసు చార్జ్ రూపంలో హోటల్ యాజమాన్యాలు సేకరించే విధానాన్నికి చెక్ పెట్టింది. సేవా రుసుము (సర్వీస్ ఛార్జ్)ను హోటళ్ళు, రెస్టారెంట్లు నిర్ణయించరాదనిస్పష్టం చేస్తూ.. సర్వీసు బాదుడుతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు కొంత ఊరట కల్పించింది. సర్వసు చార్జీల చెల్లింపు నిర్ణయాన్ని కస్టమర్లకే వదిలిపెట్టాలని పేర్కొంది. ఈ మేరకు గైడలైన్స్ ను కేంద్రప్రభుత్వం రూపొందించింది. కస్టమర్ల నుంచి వసూలు చేసే సర్వీస్ ఛార్జ్పై కేంద్ర ప్రభుత్వం నియమావళిని విడుదల చేసింది.
ఈ మేరకు కేంద్ర ఆహారం, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ సామాజిక మాద్యమం ట్విట్టర్ ద్వారా ఈ విషయాలను వెల్లడించారు. రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జ్ తప్పనిసరి అంశం కాదని, అది వ్యక్తగతమైనదని అన్నారు. సర్వీస్ చార్జ్ ఎంత చెల్లించాలి అని నిర్ణయించే అధికారం హోటల్స్కు, రెస్టారెంట్లకు లేదని, అది కస్టమర్ల విజ్ఞతకు వదిలివేయాలని ఆయన ట్వీట్ చేశారు. కస్టమర్లపై సేవా రుసుము విధింపుకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించినట్లు తెలిపారు.
ఆహార, పానీయాల బిల్లులపై సర్వీస్ ఛార్జి విధింపుకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు గత వారం ప్రభుత్వం ప్రకటించింది. హోటళ్ళు, రెస్టారెంట్లు టిప్స్కు బదులుగా సర్వీస్ ఛార్జి రూపంలో 5-20 శాతం మేరకు కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్ల సంఘాల ప్రతినిధులతో చర్చించింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సూచనలను సమీక్షించి ఈ మేరకు సవరణలు ప్రతిపాదించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more