మొదటి భార్య వుండగానే అమెకు విడాకులిచ్చి.. రెండో వివాహం చేసుకోవాలనుకునే వారికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇలా చేసే వారు తమ మొదటి భార్యకు ఖచ్చితంగా భరణాన్ని ఇవ్వాల్సిందే. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. ఉద్యోగం లేని వారు తమ అస్తులలో వాటానైనా వదులుకోవాల్సిందే. అయితే మొదటి భార్యకు చెల్లించాల్సిన భరణం విషయంలో ఒక్కో న్యాయస్థానం ఒక్కోమాదిరిగా తీర్పులను వెల్లడించడంతో.. దీనిపై కూడా సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చేసింది.
భార్యను వదిలేసినా.. లేక మరో మహిళను పెళ్లి చేసుకున్నా మొదటి భార్యకు 25శాతం భరణంగా చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఆదేశిస్తూ.. ఇక ఈ విషయంలో ఎలాంటి అస్పష్టత లేకుండా క్లారిటీ ఇచ్చేసింది. మొదటి భార్య జీవితానికి భరణం మద్దుతుగా నిలిచేలా, అమెకు సమాజంలో మొదటి భార్యను వదిలేస్తే ఆమెకు భర్త జీతంలో నుంచి 25 శాతం తప్పకుండా భరణంగా ఇవ్వాల్సిందేనంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. గౌరవప్రదంగా బతికేలా భరణం దోహదపడాలని తెలిపింది.
బెంగాల్ రాష్ట్రాం హూగ్లీకి చెందిన ఓ వ్యక్తి నెల జీతం రూ.95527 కాగా తన మొదటి భార్యకు నెలకు రూ.20వేలు భరణంగా ఇవ్వాలని జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ శాంతనగౌడర్తో కూడిన ధర్మాసనం సూచించింది. అంతకు ముందు కోల్కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తికి రూ.23వేలు భరణంగా ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాడు ఆ వ్యక్తి. అయితే కోల్కత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబట్టలేమని చెప్పిన సుప్రీం ధర్మాసనం… వ్యక్తి రెండో పెళ్లి చేసుకున్నాడు కనుక ఆ కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నందున భరణాన్ని రూ.3వేలకు తగ్గించి రూ.20వేలు చేసినట్లు సుప్రీం కోర్టు చెప్పింది.
అయితే ఒకవేళ భర్తకు ఎలాంటి ఉద్యోగం లేని పక్షంలో ఎలా అన్న విషయంలోనూ అత్యున్నత న్యాయస్థానం క్లారిటీ ఇచ్చేసింది. భర్తఉద్యోగం సద్యోగం లేకుండా తిరిగేవాడైతే అతనికి చెందిన ఆస్తులు ఉన్నాకూడా వాటిలో తన మొదటి భార్యకు హక్కులు ఉంటాయని దేశ అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఇక పెళ్లిళ్ల ఎన్నైనా చేసుకుంటాం.. పెళ్లాలను పోషించుకుంటాం అన్న భర్తలు పారాహుషార్.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more