సొంత వైద్యం హానికరం అని, వైద్యుల సలహాలు లేనిదే ఏ మందులు మాత్రలు వేసుకోరాదని డాక్టర్లతో పాటు ఎందరో ఎన్ని రకాలుగానో చెప్పినా.. ఈ చిన్నదానికి వాళ్ల వద్దకు వెళ్లేదేంటి అంటూ నిర్లక్ష్యం చేస్తాం. జలుబు చేస్తేనో లేక ఒళ్లు నొప్పులుగా ఉంటేనో వైద్యులు ఫీజులు చెల్లించడం ఎందుకు వాళ్లు రాసే ఖరీదైన మందులు వాడటం ఎందుకు అని అనుకుంటాం. కానీ ఇలా చేయడం సబబు కాదని మరోమారు తేలిపోయింది. జలుబు చేస్తే డీకోల్ట్ టోటల్,, ఒళ్లు నొప్పులుగా ఉంటే కాంబిప్లీమ్ వేసుకుంటూ ఆయా వ్యాపారాలను వందల కోట్లకు పెంచాం. కానీ వారు మాత్రం ఏం చేస్తున్నారారు.
ఈ ప్రశ్నకు బదులు తెలుసుకుంటూ అవాక్కవాల్సిందే. ఎందుకంటారా..? దేశంలోని కొట్ల మంది జలుబు ఒళ్లునోప్పులకు ఈ మాత్రలను వేసుకుంటున్నారని ఆయా సంస్థలకు తెలిసినా వారు మాత్రం నాసిరకం మందులను మార్కెట్లోకి వదలి సోమ్ముచేసుకుంటున్నారు. సామాన్య ప్రజల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ రెండు మాత్రలు ప్రమాణాలకు ఆమడదూరంలో ఉన్నాయని, పూర్తిగా నాసిరకం అని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) స్పష్టం చేసింది.
కాంబిఫ్లామ్ మాత్రలను సనోఫి ఇండియా సంస్థ తయారు చేస్తుండగా, డీకోల్డ్ టోటల్ను రెకిట్ బెంకిజర్ హెల్త్కేర్ ఇండియా సంస్థ తయారు చేస్తోంది. ప్రజారోగ్యాలతో ఈ సంస్థలు ఆడలాడుతున్నాయిన వాటికి నోటీసులు కూడా జారీ చేసింది. వీటితో పాటు మొత్తంగా మార్కెట్లలో లభించే 60 మందులు నాసికరంగా, నాణ్యతాలోపంతో వున్నాయని వాటిన్నింటికీ నోటీసులను పంపింది. అయితే ప్రముఖంగా కోట్ల రూపాయలలో టర్నోవర్ వున్న డీకోల్ట్ టోటల్, కాంబిఫ్లామ్ లతో పాటు సిప్లా తయారు చేసే ఓఫ్లాక్స్-100 డీటీ, థియో ఆస్థలిన్ టాబ్లెట్లు, కాడిలా వాళ్లు తయారుచేసే కాడిలోస్ సొల్యూషన్ కూడా లోపభూయిష్టంగానే వున్నాయని కేంద్ర ఔషద ప్రమాణాల నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more