శ్రీనగర్ లోక్సభ నియోజకవర్గం ఉపఎన్నికలో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు.. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి అయిన ఫరూక్ అబ్దుల్లా రమారమి విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ఇవాళ కొనసాగుతున్న క్రమంలో ఆయన అది నుంచి తన ప్రత్యర్థులపై అధిపత్యం చాటుకున్నారు. అధికార పీడీపీ అభ్యర్థి నాజిర్ అహ్మద్ ఖాన్ కంటే ఆయన సుమారుగా పది వేల ఓట్ల అధిక్యంతో ముందుకు దూసుకెళ్తున్నారు. కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
ఈ నియోజకవర్గంలో మొత్తంగా 12 లక్షల 61 వేల 862 మంది ఓటర్లు వుండగా, ఉగ్రవాద ప్రభావితానికి తోడు అల్లరి మూకలు సృష్టించిన హింస నేపథ్యంలో అత్యంత స్వల్ప ఓటింగ్ ఇక్కడ నమోదైంది. మొత్తంగా 52132 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఇవాళ జరిగిన ఓట్ల లెక్కింపులో 57.24 శాతంతో 29 వేల 839 ఓట్లను సాధించిన నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి ఫరూఖ్ అబ్దుల్లా రమారమి విజయం సాధించారు. అయితే అయన విజయాన్ని ఎన్నికల సంఘం అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి వుంది.
అధికార పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసిన నజీర్ అహ్మద్ ఖాన్ కేవలం 38.62 శాతం ఓట్లను సాధించి.. 20 వేల 134 ఓట్లను మాత్రమే పొందగలిగారు. దీంతో ఆయన రెండవ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నెల తొమ్మిదిన జరిగిన ఈ ఉపఎన్నికలో మొత్తం తొమ్మిదిమంది అభర్థులు పోటీపడ్డారు. పీడీపీ నేత తారిఖ్ హమీద్ రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా పోలైన 52 వేల 132 ఓట్లలో ఒక్క శాతం కన్నా అధికంగా నోటా బటన్ కు ఓటర్లు ఓటు వేశారు. దీంతో తొమ్మిది మంది అభ్యర్థులలో ఎవరూ నచ్చలేదన్న సంఖ్య కూడా ఒక్కశాతాన్ని మించింది. నోటా బటన్ ను ప్రాధాన్యమిచ్చిన ఓటర్ల సంఖ్య ఏకంగా 542గా వుంది.
వేర్పాటువాదులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడంతో... ఈ ఉప ఎన్నికలో కేవలం 7శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. తొలుత ఏప్రిల్ 9(ఆదివారం) ఇక్కడ ఉప ఎన్నికలు జరగగా.. అల్లర్ల కారణంగా అతి తక్కువ పోలింగ్ నమోదైంది. దీంతో అధికారులు తిరిగి ఏప్రిల్ 13న 38 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా ఈ నెల 9న పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసలో ఎనిమిది మంది చనిపోయారు. కాగా ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలలోకి మీడియాను అధికారులు అనుమతించలేదు. కనీసం కౌంటింగ్ కేంద్రాల వ్దనున్న మీడియాత కూడా ఎప్పటికప్పుడు ఎన్నికల సమాచారాన్ని కూడా చేరవేయలేదని మీడియా ప్రతినిధులు మండిపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more