టీడీపీ చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు, తెలుగుదేశం నేత శివప్రసాద్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని చిత్తూరులో చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను తప్పులు మాట్లాడలేదని, నిజాలు మాత్రమే చెబుతున్నానని, తన వర్గం ప్రజల తరపున ప్రతినిధిగా వారు ఏమనుకుంటున్నారో.. అదే చెప్పానని అన్నారు. ఎస్సీ ఎస్టీల డీకేటి భూములను పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టడం నిజం కాదా..? వారికి పరిహాలు చెల్లించడం లేదన్న మాట నిజం కాదా..? అని అయన అధినేత చంద్రబాబునే నిలదీశారని సమాచారం.
ఇటీవల జరిపిన మంత్రివర్గ విస్తరణలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఐదుగురికి మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సి వుండగా, కేవలం ఇద్దరికే మాత్రమే ప్రాతినిథ్యం లభించిన మాట నిజం కాదా.. అని అయన చెప్పరని తెలుస్తుంది. ఇక ఎస్సీ, ఎస్టీలకు చెందాల్సిన కోట్ల రూపాయల సబ్ ప్లాన్ నిధులు వెనక్కు వెళ్లిన మాట వాస్తవం కాదా..? అని అయన అడిగారు. వీటన్నింటిపై తనను తమ వర్గం ప్రజలు నిలదీయడం కారణంగానే తాను సభావేదిక నుంచి అధిసష్టానానికి విన్నవించుకున్నానని చెప్పారని సమాచారం.
ఇక అంతటితో అగని శివప్రపాద్ పై తీవ్రస్థాయిలో అగ్రహాం వ్యక్తం చేసిన చంద్రబాబు.. పార్టీలో కొనసాగాలంటే పర్సనల్ ఏజెండాలు పనిచేయవని.. పార్టీకి కట్టుబడి, అధినాయకత్వం ఎలా నిర్ధేశిస్తే అలా వాటికి అనుగూణంగా నడుచుకోవాలని అదేశించారని సమాచారం. అయితే, ఈ విషయంలోనూ చంద్రబాబుతో శివప్రసాద్ విభేధించారని సమాచారం. పార్టీ నాయకత్వమే పర్సనల్ అజెండాతో ముందుకు వెళ్తుందని, ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో.. ఏ నిర్ణయం తీసుకుంటుందో కూడా ప్రజాప్రతినిధులమైన తమకే తెలియడం లేదని ఇక పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ఎలా తెలుస్తుందని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. నిజాలు చెబితే నిష్టూరంగానే వుంటుందని శివప్రసాద్ అన్నట్లు తెలుస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more