ఓవైపు తమకు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకుంటే అణుదాడి తప్పదని ఉత్తర కొరియా హెచ్చరిస్తున్న నేపథ్యంలో అమెరికా తన బలం ఏంటో నిరూపించుకుంది. అఫ్ఘనిస్థాన్ లో ఉగ్రవాద సంస్థ స్థావరాలు లక్ష్యంగా అతిపెద్ద బాంబు దాడి చేసింది. ఐఎస్ఐఎస్ ప్రాబల్యం అధికంగా ఉండే తూర్పు అఫ్గానిస్థాన్ లో పక్కా సమాచారంతో గురితప్పని భారీ బాంబును విడిచినట్లు అమెరికా భద్రతా విభాగం ప్రకటించింది.
సుమారు 9,525 కిలోల బరువు కలిగిన జీబీయూ-43 అనే భారీ బాంబును యంసీ-130 ఎయిర్ క్రాఫ్ట్ నుంచి వదిలినట్లు అమెరికా రక్షణ శాఖ అధికార ప్రతినిధి జనరల్ జాన్ నికోల్సన్ వెల్లడించాడు. ఇంత భారీ బాంబుతో దాడి చేయడం ఇదే తొలిసారి అని ఆయన తెలిపాడు. అయితే పక్కా అణు రహిత బాంబు అని ఆయన స్పష్టం చేశారు. ఇంకోపక్క ఈ దాడిపై గర్విస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. గత ఎనిమిది వారాలుగా అమెరికా సైన్యం అద్భుతాలు చేస్తోందని ఆయన చెప్పారు. ఏ మూల దాక్కున్నా ఉగ్రవాదులను అంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ఈ దాడి నిర్వహించినట్టు ఆయన వెల్లడించారు. అఫ్గాన్ లోని నంగర్ హర్ జిల్లాలో ఐసిస్ ఉగ్రవాదుల భూగర్భ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడిని నిర్వహించినట్టు ఆయన తెలిపారు. ఇక ఐఎస్ఐఎస్ స్థావరాలు, సొరంగాలు, గుహలే లక్ష్యంగా అఫ్గానిస్థాన్ లో మరో భారీ దాడికి వ్యూహరచన చేసినట్లు చెబుతోంది. అయితే దాని డ్యామేజ్ ఎంత మేర ఉంటుందన్నది అసలు అంచనా వేయటమే కష్టంగా మారింది.
సిరియాతోపాటు ఇరాక్, పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ మరియు ఉజ్బెకిస్థాన్ తదితర ప్రాంతాల్లో త్వరలో వీటిని ప్రయోగించే అవకాశం ఉన్నట్లు అనధికారికంగా చెబుతుండటం ఉత్తరకొరియాకు ఇండైరక్టుగా వార్నింగ్ ఇచ్చినట్లేనని స్పష్టమౌతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more