శ్రీనగర్లో ఉప ఎన్నికల విధులు నిర్వహించుకుని తిరిగి వస్తున్న సీఆర్పిఎఫ్ జవాన్లపై జమ్మూకాశ్మీర్ కు చెందిన కొంతమంది యువత దాడి చేయడంపై భారత క్రికెటర్ల అగ్రహం కట్టలు తెంచుకుంది. చేత్తో, కాళ్లతో ఇష్టమొచ్చిన విధంగా తన్నినా, తిట్టినా జవాన్లు మాత్రం ఏమీ స్పందించకుండా అలా నడుచుకుంటూ ముందుకు కదలిన ఘటనలను చూసిన టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, క్రికెటర్ గౌతమ్ గంభీర్ లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యిన ఈ వీడియోను చూసి చలించిపోయిన క్రికెటర్లు.. ఎవరైతే సరిహద్దులో కఠోరమైన పరిస్థితుల నడుమ విధులు నిర్వహిస్తూ.. దేశ పౌరులు హాయిగా నిద్రించడానికి కారణమవుతున్నారో.. ఎవరిని చూసి శత్రుసేనలు, శత్రుదేశాల ఉగ్రవాదులు దేశంలోకి చోచ్చుకోచ్చేందుకు జంకుతున్నారో వారినా మీరు అవమానించేది.. అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీమిండియా వెటరన్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశాడు. జవాన్లపై దాడిని ఖండించాడు. ఆ వీడియోను పోస్ట్ చేసి, ఇది ఏమాత్రం సమ్మతం కాదని, మన సీఆర్పిఎఫ్ జవాన్లకు ఇలా జరగకూడదని అన్నాడు. ఈ అల్లరి మూకను అడ్డుకోవాలని చెప్పాడు.
ఇదే అంశంపై స్పందించిన క్రికెటర్ గంభీర్.. భద్రతాదళాలపై చేయిచేసుకోవటం, రాళ్ల విసరటంపై ఘాటుగా విమర్శలు చేశాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ద్వారా సంచలన ట్విట్స్ తో రియాక్ట్ అయ్యిన గంభీర్.. జవానుపై పడిన ప్రతి దెబ్బకు.. వంద మంది జీహాదీల ప్రాణం తీస్తుంది అని కామెంట్ చేశాడు. ఆజాదీ కావాలన్న వాళ్ళు ఇప్పుడే భారత్ నుంచి వెళ్ళిపోవాలనీ.. కాశ్మీర్ మాదే అంటూ తన ఆవేశాన్ని వ్యక్తం చేశాడు. దేశ జెండాలోని కాషాయ రంగు మన కోపంలోని కసిని.. తెలుపు రంగు జీహాదీల శవాలపై కప్పే గుడ్డ అని.. ఆకుపచ్చ రంగు టెర్రరిజంపై ఉన్న ద్వేశాన్ని తెలియచేస్తాయని చాలా ఘాటుగా తన ట్విట్స్ చేశాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more