కర్ణాటక ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పట్టు చాటుకుంది. కర్ణాటకలోని ఉప ఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లోనూ ఆ పార్టీ విజయం సాధించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉండటంతో ఈ ఉప ఎన్నికను ఇటు అధికార కాంగ్రెస్, అటు ప్రతిపక్ష బీజేపీ సవాలుగా తీసుకున్నాయి. హోరాహోరీగా ప్రచారం నిర్వహించినా బీజేపీ ఓడిపోవడం ఆ పార్టీ శ్రేణులకు షాక్ ఇచ్చింది. రెండుస్థానాల్లోనూ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగలింది.
సిట్టింగ్ స్థానమైన నంజన్గూడ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్ కేశవన్మూర్తి 21వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ తరఫున మాజీ మంత్రి వీ శ్రీనివాస్ ప్రసాద్ బరిలోకి దిగినప్పటికీ గట్టిపోటీ ఇవ్వలేకపోయారు. మరో సిట్టింగ్ స్థానంగుండ్లుపేటలోనూ కాంగ్రెస్ పార్టీ పదివేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గీత మహదేవ ప్రసాద్ బీజేపీ అభ్యర్థి సీఎస్ నిరంజనకుమార్ను ఓడించారు.
దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 9న జరిగిన ఉప ఎన్నికలలో మరోమారు కమలం వికసించింది. ఏకంగా పదింట ఆరు స్థానాలను బీజేపి పార్టీ తమ ఖాతాలో వేసుకుంది. డిమానిటైజేషన్ ప్రభావాన్ని నగదు ఇబ్బందులను ఎత్తిచూపడంలో విపక్షాలు విఫలం కావడంతో పాటు బీజేపి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను కూడా ప్రజల కంటికి చూపలేకపోయారు. అయితే అంతకు ముందు బీజేపియేతర ప్రభుత్వాలు చేసిన ప్రజావ్యతిరేక విధానాలను ప్రచారం చేయడంతో బీజేపి సక్సెస్ సాధించింది.
దీంతో పది అసెంబ్లీ స్థానాలలో ఆరింటిని తమ ఖాతాలో వేసుకుని మరోమారు బీజేపీ సత్తా చాటింది. అయితే అన్నింటికన్నా ముఖ్యమైన ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ సీటును అప్ నుంచి బీజేపై రాబట్టుకుంది. దీంతో మొత్తంగా ఢిల్లీ అసెంబ్లీలో నాలుగు స్థానాలకు బీజేపి శాసనసభ్యుల సంఖ్య చేరుకుంది. అయితే ఈ పరాజయంపై అప్ నేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ. తమ అభ్యర్థి కారణంగానే తాము స్థానాన్ని కోల్పోయామని, అతను ప్రజలకు దూరమైన విషయాన్ని గ్రహించలేకపోయామని చెప్పారు.
కాగా, మధ్యప్రదేశ్ బాంధవ్గఢ్లో బీజేపీ అభ్యర్థి శివనారాయణ్సింగ్ విజయం సాధించింది. అటు అసోం ధేమలీ ఉప ఎన్నికలోనూ కమలం పార్టీ పట్టుసాదించింది. రాజస్థాన్ ధోల్పూర్లోనూ బీజేపి విజయం సాధించింది. హిమాచల్ ప్రదేశ్ భోరాంజ్లోనూ కమలం పార్టీని గెలుపు వరించింది. ఇక పశ్చిమబెంగాల్ కాంతి దక్షిణ్ స్థానంలో టీఎంసీ అభ్యర్థి చంద్రిమా భట్టాచార్య ఘన విజయం సాధించి అధికార తృణముల్ పార్టీ సత్తా చాటారు. జార్ఖండ్ లితిపరాలో జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థిని గెలుపు వరించింది. ఇక కర్ణాటకలోనూ అధికార కాంగ్రెస్ తన పట్టు నిలుపుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more