ట్రంపే కాదు, ఆయన భార్య, మెలానియా కూడా వార్తలకు కొత్తేం కాదు. మోడల్ అయిన ఆమె మ్యాగ్జైన్ కవర్ పేజీలపై నగ్నంగా దర్శనమిచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక మాత్రం ఏకంగా ఆమెను వ్యభిచారిణి(ఎస్కార్ట్) అని కామెంట్ చేసి చిక్కుల్లో పడటమే కాదు, కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. చివరకు ఆ పోరులో మెలానియానే విజయం సాధించి, భారీ సొమ్మును పరువు నష్టం కింద వసూలు చేసింది.
ప్రముఖ బ్రిటన్ పత్రిక ‘డెయిలీ మెయిల్’ గతేడాది అమెరికా ఎన్నికల సందర్భంగా ఓ ఆర్టికల్ ప్రచురించింది. మెలానియా గతంలో వ్యభిచార వృత్తిలో ఉండేవారని, ఆమె పని చేసిన ఓ ఏజెన్సీ కంపెనీ నిర్వాహకుడే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడని పేర్కొంటూ ఓ ఆర్టికల్ ప్రచురించింది. ఈ కథనంపై మెలానియా మేరీల్యాండ్ కోర్టులో పరువునష్టం దావా వేసింది. అయితే అది తమ పరిధిలోకి రాదని మేరీల్యాండ్ చెబుతూ కోర్టు పిటిషన్ ను కొట్టేసింది. దీంతో ఫిబ్రవరిలో న్యూయార్క్ లో ఆమె మరో పిటిషన్ దాఖలు చేసింది. తన పరువుకు భంగం కలిగించేలా అసత్య కథనాలు ప్రచురించారని ఆమె తరపు న్యాయవాది వాదించాడు. కోర్టు కూడా వాటితో ఏకీభవించింది. దీంతో డెయిలీ మెయిల్ తోపాటు మెయిల్ వన్ యాజమాన్యాలు మెలానియాతో రాజీకి వచ్చింది.
ఈ విషయాన్ని పత్రికతోపాటు మెలానియా అడ్వొకేట్ కూడా ఓ ప్రకటనలో తెలిపారు. మెలానియాకు క్షమాపణలు చెప్పడంతోపాటు ఆమెకు 2.9 మిలియన్ డాలర్లు (రూ.19 కోట్లు) చెల్లించేందుకు అంగీకరించినట్టు తెలిసింది. కాగా, మెలానియా 150 మిలియన్ డాలర్లు (రూ.1000 కోట్లు) డిమాండ్ చేశారు. మెయిల్ ఆన్లైన్తోపాటు మరో నాలుగు వార్తా సంస్థలకు కూడా మెలానియా నోటీసులు పంపగా, వారిని మాత్రం క్షమాపణలు చెబితే చాలని తెలిపింది. కాగా, పిటిషన్ దాఖలు చేసిన సమయానికి ఆమె అమెరికా అధ్యక్షుడి భార్యగా దేశ ప్రథమ మహిళ హోదాలో ఉన్నప్పటికీ, ఆ కథనం సెప్టెంబర్ లో రావటంతో ఓ మాములు బిజినెస్ మెన్(ట్రంప్) భార్యగానే ఆమె తన పేరును అందులో పేర్కొనటం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more