అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరచటమే ధ్యేయమని ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రకటించిన టీఆర్ఎస్ బాస్ కే. చంద్రశేఖర్ రావు, ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాక వాటి అమలు కోసం గట్టిగానే యత్నాలు మొదలుపెట్టాడు. ప్రత్యేక భవన సముదాలను కల్పించటం, పండగలకు భారీగా నిధులు వెచ్చించటం లాంటి వాటితో సరిపెట్టకుండా బోనస్ గా రిజర్వేషన్ల పరంగా కోటా పెంచే ఆలోచనను అమలు చేస్తున్నాడు.
ఇందులో భాగంగా ముస్లింలకు, ఎస్టీలకు 12 శాతం దాకా రిజర్వేషన్లను పెంచే దిశగా అడుగులు వేయబోతున్నాడు. బీఎస్ రాములు నేతృత్వంలోని బీసీ కమిషన్ ఇప్పటికే అందుకు అవసరమైన రికమండేషన్లతో నివేదికను సమర్పించగా, ముందు కేబినెట్ మీటింగ్ లో చర్చించి, ఆపై గవర్నర్ ను కలిసి ఆ ప్రతిపాదనను వివరించాడు. ఇక మిగిలింది అసెంబ్లీ లో దానిని బిల్లుగా ఆమోదింపజేయటమే. కానీ, అందుకు కొన్ని అడ్డంకులు ఇక్కడ ఉన్నాయి.
ముస్లింలకు ప్రస్తుతం 4 శాతం కోటా ఉండగా, ఎస్టీలకు 6 శాతంగా ఉంది. సుప్రీంకోర్టు మార్గ దర్శకాల ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా రిజర్వేషన్ల కోటా 50 శాతానికి మించి ఉండకూడదు. ముస్లింలకు ఏడు నుంచి 9, ఎస్టీలకు 6 నుంచి 9 దాకా ఉండొచ్చు. అయితే కేసీఆర్ మాత్రం ముస్లింలకు 12 శాతం చేయాలన్న ఆలోచనతో కోటా 69 శాతంకి చేరుతుంది. దీంతో ఆటోమేటిక్ గా న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉంటుంది.
నిజానికి మార్చి 27న ఓ ప్రకటనలో వారం రోజుల్లో బిల్లు కార్యరూపం దాలుస్తుందని స్వయంగా కేసీఆరే చెప్పినప్పటికీ అది జరగలేదు. భవిష్యత్తులో నివారించేందుకు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో మార్పులు చేయాల్సిందిగా కేంద్రానికి విజ్నప్తి చేయటం, వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంతోనే ఆలస్యం జరిగినట్లు అర్థమౌతోంది. మరోపక్క ఎంఐఎం కూడా రిజర్వేషన్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గొద్దంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. అయితే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలత చూపుతుందనుకోవటం అత్యాశే అవుతుంది.
పైగా మతపరమైన బిల్లులను వ్యతిరేకిస్తూ బడ్జెట్ సమావేశాల్లో పెద్ద గందరగోళమే జరిగింది కూడా. అయినప్పటికీ ముందు అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించి, ఆపై కేంద్రంపై గొడవ పడకుండా కేవలం ఒత్తిడి ద్వారా సాధించుకోవాలన్నదే తెలంగాణ ప్రభుత్వ అభిమతంగా కనిపిస్తోంది. ఏ అంశంలో అయినా వెనకడుగు వేయని గులాబీ బాస్ ఎవరినీ నొప్పించకుండా దీనిని ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more