అమెరికాలోని షికాగో నగరం కాల్పలతో దద్దరిల్లింది. మూడు వేర్వరు ప్రాంతాల్లో దుండగులు కాల్పలు జరుపగా, ఈ ఘటనల్లో ఏడుగురు అసువులు బాసారు. ప్రపంచంలోనే మూడవ ఆతిపెద్ద నగరమైన చికాగో వాసులను వరుస కాల్పల ఘటనలు అందోళనకు గురిచేశాయి. చికాగోలోని సౌత్ షోర్ నైబర్ హుడ్ ప్రాంతంలో గ్యాంగ్ వార్ చోటుచేసుకుంది. నాడియా ఫిష్ అండ్ చికెన్ రెస్టారెంటులోకి చేరుకున్న ఓ యువకుడు లోనికి ప్రవేశిస్తూనే తన ప్రత్యర్థి గ్యాంగ్ కు చెందిన యువకులపై కాల్పులకు తెగబడ్డాడు.
తన వద్దనున్న గన్ తీసి కాల్పులు జరపడంతో ఇద్దరు అన్నదమ్ములు రహీమ్, డిల్లాన్ జాక్సన్ తో పాటు వారి మరో స్నేహితుడు ఇమాన్యూయల్ స్ట్రోక్స్ కూడా విఘతజీవిగా ామరాడు. ఇక నాలుగో వ్యక్తి కూడా ఎలాంటి కదలిక లేకుండా వున్నాడని, అయితే అతను ఎవరన్న విషయం మాత్రం పోలీసులు వెల్లడించలేదు. రెండు గ్యాంగ్ ల మధ్య జరుగుతున్న అధిపత్యపోరు కారణంగానే ఈ కాల్పులు ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే గంటల వ్యవధి ముంది ఈ రెస్టారెంట్ కు రెండున్నర కిలోమీటర్ల దూరంలో వున్న సౌత్ లీయోలా ప్రాంతంలోని ఒక అపార్టు మెంటులో కాల్పులు శబ్దం వినిపించిడంతో స్థానికుల నుంచి పిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి చూడగా, అక్క ఓ నాలుగు నెలల గర్భిణీ స్త్రీ నిర్జీవంగా రక్తపు మడుగులో పడివుందన్నారు. అమెను పాట్ రైస్ కాల్వన్ గా గుర్తించిన పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా అదేరోజు రాత్రివేళ ఓ 27ఏళ్ల యువకుడితో పాటు ఓ మహిళ కూడా కాల్పులకు గురై మరణించారని పోలీసులు తెలిపారు. వారు 71 స్ట్రీట్ కు గ్రే వాన్ లో వెళ్తుండగా అటుగా వచ్చిన నల్లని జీవులోని వ్యక్తులు కాల్పులు తెగబడటంతో వీరు మరణించారని పోలీసులు తెలిపారు.
గత ఏడాది 760 హత్యలతో ఇప్పటికే చికాగో నగరం న్యూయార్క్, లాస్ ఏంజెల్స్ నగరాలను కలిపిన మించిపోయే క్రైం రేటు నమోదు చేసుకుంటున్న తరుణంలో ఇలాంటి ఘటనలు నగర ప్రతిష్టను మరింత దిగజార్చుతున్నాయని పలువరు అందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా నమోదు కానీ నేరాల సంఖ్య ఇక్కడ గత ఏడాది నుంచి నమోదు కావడం పట్ల స్థానికులు కూడా అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో తగ్గిన నేరాల సంఖ్య రెండో త్రైమాసికానికి వచ్చే సరికి గణనీయంగా పెరగడం కూడా పోలీసులను కలవరానికి గురిచేస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more