దేశంలోని ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులన్నింటితోపాటు ఆర్బీఐకి చెందిన కొన్ని కార్యాలయాలు కూడా ఈనెల 25 నుంచి వచ్చేనెల 1 వరకు ప్రతిరోజూ తెరిచి ఉంటాయని ఆర్బీఐ అధికారిక ప్రకటన చేసింది. ఈనెల 31తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో పన్ను వసూళ్లు ప్రభుత్వ నగదు స్వీకరణ చెల్లింపులు వంటి లావాదేవీలకు ఆటంకం కలుగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 1 వరకు అన్ని రోజులు తెరిచి ఉంచాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్బీఐ తన వెబ్ సైట్లో స్టేట్ మెంట్ విడుదల చేసింది. దీంతో ఈ శని - ఆదివారాల్లోనూ బ్యాంకింగ్ శాఖలు తెరిచే ఉంటాయి.
ఆర్ బీఐలో ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలను చేపట్టే విభాగాలు కూడా వచ్చేనెల మొదటి తేదీ వరకు ప్రతిరోజూ పనిచేయనున్నాయి. మరోపక్క నల్లకుబేరులు స్వచ్ఛందంగా తమ ఆస్తులను ఈ నెలాఖరులోగా వెల్లడించాలని ఆదాయ పన్నుశాఖ స్పష్టం చేసింది. లేకపోతే చింతించక తప్పదని హెచ్చరించింది. మార్చి 31తో పీఎంజీకేవై ముగుస్తుంది. ఆస్తు లు వెల్లడించినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఐటీశాఖ హామీ ఇచ్చింది. ఆదాయాన్ని వెల్లడించని డిఫాల్టర్ల పేర్లను ఈడీ - సీబీఐ వంటి జాతీయ సంస్థలకు తెలియజేస్తామని ఆ శాఖ అధికారులు తెలిపారు.
పెద్దనోట్ల రద్దు తరువాత భారీఎత్తున డబ్బును డిపాజిట్ చేసి పీఎంజీకేవైని వినియోగించనివారికి భారీగా జరిమానా విధిస్తామని ఐటీ అధికారులు తెలిపారు. డిఫాల్టర్లపై బినామీ లావాదేవీల చట్టం కూడా ప్రయోగిస్తామన్నారు. ఈ పథకం కింద ఆదాయాన్ని వెల్లడించిన వ్యక్తి లేదా సంస్థ.. డిపాజిట్ చేసిన ఆదాయంలో 49.9 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని అయితే ఈ పథకాన్ని ఉపయోగించుకోకుండా ఇన్కంట్యాక్స్ రిటర్న్ లో ఆదాయాన్ని తెలిపిన వారికి జరిమానాతోపాటు 77.25 శాతం పన్ను విధిస్తామని చెప్పారు.
ఆదాయాన్ని వెల్లడించకుండా ఆధారాలులేని డబ్బుతో దొరికిపోయిన వారికి 83.25 శాతం పన్ను విధిస్తామని అధికారులు తనిఖీలు చేసి ఆధారాలులేని ఆదాయాన్ని కనుగొంటే 107.25 శాతం పన్నుతోపాటు జరిమానా విధిస్తామని తెలిపారు. అధికారుల తనిఖీలలో కూడా ఆదాయాన్ని బహిర్గతం చేయనివారికి జరిమానాతోపాటు 137.25 శాతం పన్ను విధిస్తామని చెప్పారు. ఉల్లంఘనులపై బినామీ చట్టాన్ని ప్రయోగిస్తే వారికి ఏడేండ్ల కఠిన కారాగారశిక్షతోపాటు ఐటీ చట్టం కింద ఆరోపణలు మోపే అవకాశం కూడా ఉంటుందన్నారు.
ఆ విషయాన్ని చెప్పలేం... ఆర్బీఐ
పాత నోట్లను మార్చి 31, 2017 వరకు మార్చుకోవచ్చన్న ప్రధాని మాటను ఆ తర్వాత రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా పక్కన పడేసింది. కేవలం నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కు మాత్రమే వెయ్యి, ఐదొందల నోట్లను మార్చుకునే వీలు కల్పించింది. దీనిపై ఆర్టీఐ చట్టం ద్వారా ఆర్బీఐని వివరణ కోరగా, అందుకు నిరాకరించింది.
అది పూర్తిగా చట్టానికి సంబంధించిందని, గోప్యత పాటించాల్సిన అవసరం ఉందని, అదసలు సమాచార హక్కు చట్టం కిందకు రాదంటూ వివరణ ఇచ్చింది. సాధారణ పౌరులకు డిసెంబర్ 30, 2016 దాకా మాత్రమే ఆ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. ఎన్నారైలు బీజేపీ ప్రభుత్వానికి మద్ధతుగా ఉన్నారన్న కారణంగానే వారికి ఈ వెసులుబాటు కల్పించారన్న ఆరోపణ ఒకటి ఉంది. ఇంకోపక్క మరిన్ని కొత్త నోట్ల ముద్రణ మాత్రం ఇప్పట్లో ఉండదని చెప్పేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more