తమ భవిష్యత్తు కోసం అధికార పక్షంలో చేరుతున్న జంపర్లకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ గట్టి షాకే ఇచ్చారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి విషయంలో నియామవళిని ప్రకటించాడు. రాజీనామా చేసిన తరువాత మాత్రమే మంత్రి పదవులు స్వీకరించేందుకు రాజ్ భవన్ కు రావాలని వారికి ఆయన తేల్చి చెప్పినట్టు సమాచారం. ఇటీవల ఏపీకి చెందిన ఓ సీనియర్ నేత విషయంలో ఆయన ఈ నిర్ణయం వెలువరించినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, ఆపై మంత్రి పదవుల కోసం రాజ్ భవన్ కి రావాలి. ఆపై ఆరు నెలల్లో ఏదో రూపంలో ఎన్నికల్లో గెలవాలని నరసింహన్ కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పాడంట. అలా కాకుండా మంత్రి పదవులు పొందాలని చూస్తే మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోనని చెప్పడంతో ఫిరాయింపుదారులకు షాక్ తగిలినట్లయింది.
వైకాపా నుంచి గెలిచి, టీడీపీలోకి జంప్ అయిన కొందరు త్వరలో జరిగే మంత్రి వర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. ఈ తరుణంలో గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పైగా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, అవి స్పీకర్ తో ఆమోదం పొందిన తరువాతనే వారితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తానని చెప్పడంతో ఏం చేయాలోనని పార్టీ నేతలు తలపట్టుకుంటున్నట్టు సమాచారం.
గతంలో జరిగిన కొన్ని అనుభవాల దృష్ట్యా అన్న కామెంట్ ను అనుసరించి.. తెలంగాణలో టీడీపీ టికెట్ తో గెలిచి, టీఆర్ఎస్ లో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహారంలో నరసింహన్ పై తీవ్ర విమర్శలు రావటంతోనే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. అంతేకాదు ఫిరాయింపులపై న్యాయస్థానంలో కూడా కేసులు నమోదవుతుండటంతోనే గవర్నర్ గట్టి నిర్ణయంతో ఉన్నారని రాజ్ భవన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలకు కాస్త ఊరట కలిగించేలా ఈ నిర్ణయం ఉందని పొలిటికల్ పండితులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more