ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థులపై దాడి, ఆపై బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్) యే అందుకు కారణమంటూ ఓ యువతి పెట్టిన పోస్ట్ ఇప్పుడు రచ్చ రచ్చగా మారుతోంది. ఫిబ్రవరి 22న రాంజాస్ కాలేజీలో చెలరేగిన హింసకు ఏబీవీపీ కారణమంటూ సదరు యువతి ఓ పోస్ట్ చేసింది. అప్పటి నుంచి తనకు బెదిరింపులు ఎక్కువయ్యాయని, కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని 20 ఏళ్ల గరుమెహర్ కౌర్ చెబుతోంది.
ఈ యువతి 1999 కార్గిల్ యుద్ధంలో మరణించిన కెప్టెన్ మన్దీప్ సింగ్ కుమార్తె. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కిందే నేను ఆ వ్యాఖ్యలు చేశాను. ఏబీవీపీ తన పోస్ట్ పై తీవ్ర పదజాలంతో కామెంట్లు చేస్తోంది. రాహుల్ అనే వ్యక్తి అయితే తనను ఎంత క్రూరంగా రేప్ చేస్తాడో వివరంగా చెబుతూ ఓ సందేశం ఉంచాడు. దాన్ని చూసిన తనకు ఎంతో భయం వేసిందని అన్నారు. తనను జాతి వ్యతిరేకిగా చూస్తూ, ఎంతో మంది తిడుతున్నారని, రేప్ చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. నన్ను గురుమెహర్ అని మాత్రమే పిలవండి.. దయచేసి అమరవీరుడు కూతురిగా చూడకండి అంటూ కోరింది కూడా.
రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్ ను రాంజాస్ కాలేజీలో ఓ సెమినార్ కు ఆహ్వానించడాన్ని ఏబీవీపీ వ్యతిరేకించగా, దానిపై స్పందించిన గుర్ మోహన్, తన ఫేస్ బుక్ ప్రొఫైల్ చిత్రాన్ని మారుస్తూ, తాను ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థినని, ఏబీవీపీకి భయపడనని, తాను ఒంటరిదాన్ని కాదని, ఇండియాలోని ప్రతి విద్యార్థీ తన వెంటనే ఉన్నాడని రాసిన ప్లకార్డును ప్రదర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై కొందరు మద్దతిస్తూ ఓ వర్గం, వ్యతిరేకిస్తూ మరో వర్గం సోషల్ మీడియాలో కామెంట్లు గుప్పిస్తున్నారు.
సెహ్వాగ్ కు ఏం సంబంధం?
శ్రీరామ్ కాలేజి విద్యార్థిని అయిన ఈ గుర్మెహర్ గతంలో ఓ పోస్ట్ ఉంచింది. తన తండ్రిని పాకిస్థాన్ చంపలేదని, యుద్ధ చంపిందని రాసిన ఫ్లకార్డ్ చేతబట్టుకుని ఉన్న ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశాక వార్తల్లోకి వచ్చింది. ఇక ఇప్పుడు ఆ పోస్టుకు సెహ్వాగ్ తన దైన ఫన్నీ స్టైల్ లో ట్వీట్ చేశాడు. 'నేను రెండు ట్రిపుల్ సెంచరీలు చేయలేదు. నా బ్యాట్ చేసింది' అంటూ ట్వీట్ చేశాడు. వీరూ ఈ ట్వీట్ చేయగానే చాలా మంది నెటిజెన్లు స్పందించారు. వీరిలో సెలెబ్రిటీలు, రచయితలు ఉన్నారు. కొందరు వీరూను సమర్థించగా.. మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మొత్తానికి వీరూ చేసిన ట్వీట్ దుమారం రేపింది. నెటిజెన్ల మధ్య ట్విట్టర్ వార్కు తెరలేపింది. 15 వేల మంది సాధారణ పౌరులను, 6,726 మంది సైనికులు చంపిన పాక్ పై సానుకూల పోస్ట్ పెట్టిన గురుమెహర్ కు ఇతరులను విమర్శించే హక్కు లేదంటూ పలువురు మండిపడుతున్నారు. ఇక ఆ ఫోటోతో ట్రోల్స్ కూడా తెగ చక్కర్లు కొడుతున్నాయి.
Who's polluting this young girl's mind? A strong Arm Force prevents a war. India never attacked anyone but a weak India was always invaded. https://t.co/gXHkAGi9sh
— Kiren Rijiju (@KirenRijiju) February 27, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more