ఇస్రో అద్భుత ప్రయోగం ఫలించింది. అంతరిక్ష పరిశోధనల్లో తొలిసారిగా 104 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెట్టిన ఘనత దక్కించుకుని ప్రపంచ రికార్డు సాధించింది. ఫలితంగా భారత కీర్తి పతాక మరోసారి జగద్వితమైంది. పీఎస్ఎల్వీ-సీ37 నిమ్ములు చిమ్ముతూ నింగికెగసి విజయవంతంగా కక్ష్యలోకి ఉపగ్రహాలను వదిలింది. సరిగ్గా 9.28 గంటలకు శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ37 టేకాఫ్ తీసుకుంది. తనతోపాటు 104 శాటిలైట్లను నింగిలోకి తీసుకెళ్లింది. 714 కిలోల బరువున్న అత్యంత బరువైన కార్టోశాట్ 2డీ ఉపగ్రహంతోపాటు మరో రెండు దేశీ వాళీ శాటిలైట్లను, మిగతా విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించటంలో ముఖ్య భూమిక పోషించింది.
వందకు పైగా శాటిలైట్లను ఒకేసారి నింగిలోకి పంపుతున్న నేపథ్యంలో, ప్రపంచమంతా ఇస్రో ప్రయోగాన్ని ఆసక్తికరంగా పరిశీలించింది. 17 నిమిషాల తర్వాత ఉపగ్రహాలు రాకెట్ నుంచి విడిపోవడం ప్రారంభమై, 524 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఉపగ్రహాలను కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. మొత్తం దూరాన్ని 22 నిమిషాల్లో ప్రయాణించిన రాకెట్ అన్ని ఉపగ్రహాలను విడిచిందని, వాటి నుంచి భూమిపై వివిధ ప్రాంతాల్లో ఉన్న సెంటర్లకు సిగ్నల్స్ అందుతున్నాయని చెప్పారు. ప్రయోగం సక్సెస్ కావటంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. ఇక ప్రయోగం ఇలా సక్సెస్ అయ్యిందో లేదో రాష్ట్రపతి, ప్రధాని, పలువురు ప్రముఖులు తమ అభినందనలు తెలియజేశారు.
ఇప్పటిదాకా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 59 ప్రయోగాలు చేసింది. అందులో 84స్వదేశీ, 79 విదేశీ శాటిలైట్లు ఉన్నాయి. 38 సార్లు పీఎస్ఎల్వీతో ఉపగ్రహాలను పంపగా అందులో 37 సూపర్ సక్సెస్ అయ్యాయి. కాగా, ఇప్పుడీ రికార్డు ప్రయోగంతో 39వది కూడా విజయవంతం కావటమే కాదు, అంతరరిక్షంలో భారత్ జైత్రయాత్ర కు అలుపు లేదని నిరూపించింది. ఇంతకు ముందు 37 ఉపగ్రహాలతో రష్యా, 27 శాటిలైట్లతో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలు నిలవగా, ఇప్పుడు భారత్ ఆ రికార్డును చెరిపిపడేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more