తెలంగాణ రాజకీయ కీలక వ్యవహారాలల్లో జోక్యం చేసుకుంటున్నారని సీఎం కేసీఆర్ వారసులు కేటీఆర్, కవితలపై విమర్శలు వినిపిస్తున్నప్పటికీ, వాటి ద్వారా లాభాలే చేకూరుతుండటంతో ఆరోపణలకు ఆస్కారం లేకుండా పోతుంది. ఓవైపు ప్రత్యక్షంగానే కాదు, సోషల్ మీడియా ద్వారా కూడా పరోక్షంగా సమస్యల పరిష్కారానికి చేసేందుకు వీరివురు ముందుకు రావటం గమనార్హం. ఇక తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే.
ఆ మధ్య హైదరాబాదుకు చెందిన సురేన్ దంపతులు ఓ ఫొటోను మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా ట్యాగ్ చేయగా, ‘గుండెల్ని తాకే ఫోటో ఇది’ అంటూ కేటీఆర్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. పిల్లలను ఉదయాన్నే నిద్రలేపడం బాధాకరమని వాళ్ల స్కూల్ టైమింగ్స్ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు చేయాలని కేటీఆర్ కు విన్నవించగా, ఆ ఫొటో చూసిన కేటీఆర్ చలించిపోయి విద్యాశాఖతో ఈ విషయమై చర్చిస్తానని హామీ కూడా ఇఛ్చాడు.
ఇక ఇప్పుడు కవిత వంతు వచ్చింది. పేపర్ లో చదివిన ఓ ఆర్టికల్ ను షేర్ చేసిన ఆమె సదరు సమస్యపై అధికారులతో చర్చింది కూడా. విషయం ఏంటంటే... సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు ఎదుర్కుంటున్న బాధలు వర్ణనాతీతం అంటూ ఆమె ఓ పత్రిక కథనాన్ని పోస్ట్ చేసింది. కళాశాల పక్కనే శ్మశానం ఉండటం, దహన సంస్కారాలు జరిగే సమయంలో పొగ తరగతి గదుల్లోకి రావటం, గదిలో ముక్కు మూసుకొని అవస్థలు పడుతూ పాఠాలు వినటం, పైగా అనారోగ్యం బారిన పడటం ఇలా అందులో ఉండటంతో ఆమె చలించిపోయారు.
I was shocked to read this news as well ... am already speaking with authorities https://t.co/vHlMOErfwf
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 7, 2017
ఈ వార్తను చదివి షాక్కు గురయ్యానని, వారి సమస్యలను తీర్చడానికి తాను ఇప్పటికే సంబంధిత అధికారులతో మాట్లాడానంటూ ట్వీట్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు విద్యార్థినుల దుస్థితి గురించి వివరణ తీసుకుని పరిష్కారం చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. మొత్తానికి ఇద్దరు వారసులు ఇలా సోషల్ మీడియా బేస్ తోనే సమస్యలన్నీ చకచకా పరిష్కరించుకుపోవటం విశేషమనే చెప్పుకోవాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more