భారత దేశం నుంచి అవినీతి పారద్రోలుతూ, నల్లధనాన్ని రూపుమాపుతూ గత ఏడాది నవంబర్ఎనమితిన కేంద్ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మక, చారిత్రక, సాహసోసేత నిర్ణయం పాత పెద్ద నోట్ల రద్దు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. 50 రోజుల పాటు ప్రజలందరూ సంయమనం పాటించాలని, కష్టాలన్నీ ఈ లోగా తీరిపోతాయని కూడా ఆయన చెప్పారు. అయితే నగదు విత్ డ్రాలపై అంక్షలు కూడా పెట్టారు.
ఓ వైపు నగదు విత్ డ్రా చేసుకోవడం కష్టంగా పరిణమించగా, అదే సమయంలో పాత పెద్దనోట్లను బ్యాంకుల్లో జమ చేయడానికి కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోన్నారు. ప్రధాని ప్రజలకిచ్చిన మాట కూడా ధాటిపోయినా పరిస్థితుల్లో మార్పు మాత్రం కనబడలేదు. అటు ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశాలను స్థంభింపజేసినా.. ప్రభుత్వ తీరును తూర్పారబట్టినా.. వ్యూహాత్మక మౌనం పాటించిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకులకు మాత్రం దేశ ప్రజలకు ఊరటినిస్తూ నిర్ణయం తీసుకుంది.
నగదు రహిత దేశంగా రూపోందించే క్రమంలో క్యాష్ లెస్ ఎకానీమినీ ప్రోత్సహించడంతో పాటు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్న కేంద్రం.. ఇటీవల కరెంట్ అకౌంట్ దారులకు మాత్రం నగదు విత్ డ్రాలపై ఊరటను కల్పించింది. బడ్జెట్ లో సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకు ఊరట లభిస్తుందని వేచి చూసినా.. ఎలాంటి శుభవార్త అందలేదు. దీంతో పెద్దగా నిట్టూర్పు విడిచిన ఖాతాదారులకు ఎట్టకేలకు 124 రోజుల తరువాత నగదు విత్ డ్రాల నుంచి విముక్తి లభించి.. మళ్లీ పాత రోజులు రానున్నాయి. దీంతో పాటు మారో శుభవార్తను కూడా కేంద్రం సేవింగ్స్ అకౌంటు ఖాతాదారులకు అందించింది.
ఇప్పటి వరకు వారానికి కేవలం 24 వేల రూపాయల నగదును మాత్రమే ఏటీయం కేంద్రాలలో విత్ డ్రా చేసుకునే సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకు ఈ నెల 20 నుంచి భారత దానిని 50 వేల రూపాయలకు పెంచుతున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు గవర్న్ ఉర్జిత్ పటేల్ ఇవాళ వెల్లడించారు. ఇకపై ఒక వారానికి ఏటీయం కేంద్రాల నుంచి రూ.50 వేలను విత్ డ్రా చేసే వెసలుబాటు కల్పించారు. దీంతో పాటు మార్చి నెల 13 తరువాత అనగా పాత పెద్దనోట్ల రద్దు చేసిన 124 రోజుల తరువాత ఖాతాదారులందరూ పెద్దగా ఊపిరి పీల్చుకోనున్నారని, అ రోజు నుంచి నగదు విత్ డ్రాలపై ఎలాంటి అంక్షలు వుండబోమని అర్బీఐ తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more