గోవా, పంజాబ్ ఎన్నికలలో ఓటర్లు పండరేపారు. ఆయా రెండు రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఓటు హక్కును ఓటర్లు వినియోగించుకున్నారు. ఓటింగ్ శాతం పెరగడంతో తామే గెలుస్తామని అంచనాలు వేసుకున్న అభ్యర్థల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఓటింగ్ శాతం అనుకున్న స్థాయికన్నా అధికంగా నమోదుకావడంతో తమ గెలుపు అంచనాలపై ఏలాంటి ప్రభావం చూపుతుందోనని అందోళన చెందుతున్నారు. సాధారణంగా 60-65 శాతం పోలింగ్ జరిగితేనే అబ్బా అనే అభ్యర్థులు రికార్డు స్థాయిలో ఓటింగ్ తో ఉత్కంఠకు గురవుతున్నారు.
గోవా అసెంబ్లీకి ఇవాళ జరిగిన ఎన్నికల్లో ఏకంగా 83 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు పంజాబ్లో సైతం 70 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. గోవాలో ఎన్నికలు సాధారణంగానే జరిగినా, పంజాబ్లో మాత్రం ఈవీఎంలు మొరాయించడం, వాతావరణం అనుకూలించకపోవడంతో కాస్త ఆలస్యమైంది. అయినా కూడా సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నవారిని మాత్రమే ఓటు వేయడానికి అనుమతిస్తామని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. నవంబర్ నెలలో ప్రధాని మోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో వీటి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
గోవా, పంజాబ్ రెండు రాష్ట్రాల్లోనూ తుది వివరాలు తెలిసేసరికి పోలింగ్ శాతం మరికొంత పెరగొచ్చని ఎన్నికల అధికారులు చెప్పారు. రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూలైన్లు ఉండటమే అందుకు కారణం. పంజాబ్లోని మాల్వా ప్రాంతంలో ఓటింగ్ బాగా జరిగింది. రాష్ట్రంలోని 117 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మాల్వా బెల్టులోనే 69 ఉన్నాయి. దాంతో.. ఇక్కడ ఏ పార్టీ గాలి వీస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం దాదాపు ఖాయం. అకాలీదళ్, కాంగ్రెస్ పార్టీలతో పాటు కొత్తగా వచ్చిన ఆప్ కూడా ఇక్కడ గట్టిగా పోటీపడుతోంది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు మార్చి 11వ తేదీన వెలువడతాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more