మీడియా కథనాలు ఒక్కోసారి విపరీతాలకు దారితీస్తే.. అనేక పర్యాయాలు మాత్రం మీడియా కథనాలతో మంచే జరుగుతుంది. ఈ సారి మీడియా కథనాలలో వచ్చిన వార్తలు ఏకంగా ముగ్గురు దొంగలను పట్టించింది. ఏటీఎంలలో డబ్బులు పెడుతున్న వ్యాన్ను దోచుకుని జీవితంలో స్థిరపడాలని భావించిన దొంగలకు మీడియా కథనాలు చుక్కలు చూపించాయి. వారు దొంగలించిన మొత్తం కూడా కొత్తగా వచ్చిన రెండు వేల రూపాయల నోట్లే కావడం.. సరిగ్గా కథనాలకు సరితూగుతున్నట్లుగా వుండటంతో.. దొంగలు పల్టీ కోట్టారు. పోలీసుల చేతికి చిక్కారు.
ఇంతకీ మీడియా కథనం ఏంటంటారా.. కొత్తగా ముద్రిస్తున్న నోట్లలో జీపీఎస్ చిప్ ఉందంటూ మీడియాలో జరిగిన ప్రచారం వాళ్ల కొంప ముంచింది. నిజంగా అలాంటి చిప్ ఉందేమో, దానివల్ల తాము పట్టుబడతామన్న భయంతో ఎక్కడైనా ఖర్చుపెడితే దొరికిపోతాం అనుకున్నారు.. చివరకు దొంగతనం అయితే చేశారు కానీ దాంట్లోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా దొంగలించిన సొమ్ము మొత్తంతో పోలీసలుకు దొరికిపోయారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి.
సూత్రధారి అయిన బిట్టూ (29) ఒక డిస్కం అధికారి వద్ద కారు డ్రైవర్..జీవితంలో స్థిరపడాలని తాను నిత్యం చూసే ఏటీఎంలలో డబ్బులు నింపే వ్యాన్లను టార్గెట్ చేశాడు. అందుకు రోహిత్ నాగర్ (19), సన్నీ శర్మ (22) అనే ఇద్దరిని తోడు తీసుకున్నాడు. ముగ్గురూ కలిసి పలుమార్లు రెక్కీ నిర్వహించారు. తమ ప్లాన్ లో భాగంగా ముందుగా వాళ్లు ఒక మోటార్ సైకిల్ చోరీచేసి, దాని నంబర్ ప్లేట్ మార్చేశారు. డిసెంబర్ 19న క్యాష్ వ్యాన్ను ఫాలో అయ్యి, దాన్ని దోచుకోడానికి షకార్పూర్, లక్ష్మీనగర్, నిర్మాణ్ విహార్ ప్రాంతాల్లో మూడుసార్లు ప్రయత్నంచి విఫలమయ్యారు.
ఆ తరువాత పత్పర్గంజ్ క్రాసింగ్ వద్ద కాస్త జనం తక్కువగా ఉండటంతో గార్డును బెదిరించడానికి కాల్పులు జరిపారు. శర్మ తుపాకితో డ్రైవర్ను, గార్డును బెదిరించాడు. అక్కడినుంచి జాగ్రత్తగా తప్పించుకుని యమునా పుష్ట వైపు పారిపోయారు. అక్కడ బ్యాగులోంచి డబ్బులు తీసి, తమ జేబుల్లో నింపేసుకున్నారు. బ్యాగును ఓ డ్రెయిన్లో పారేశారు. బైకును కూడా అక్కడే వదిలేశారు. రెండు ఆటోలు మాట్లాడుకుని ఇళ్లకు వెళ్లారు. ఒక రోజు తర్వాత అంతా కలిసి హరిద్వార్ పారిపోయారు.
అయితే.. టీవీలలో ఫ్లాష్ న్యూస్ చూసి, నిజంగా కొత్త నోట్లలో జీపీఎస్ చిప్లు ఉన్నాయేమోనని భయపడ్డారు. ఈలోపు పోలీసులు వీళ్లను జాగ్రత్తగా గమనించారు. స్తానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫూటేజ్ ను కూడా పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం మాటు వేశారు. అయితే చిప్ వుందన్న భయంలో దోంగలించిన సోమ్ములో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ముగ్గురు దోంగలు దొంగిలించిన కారులో ఒక మాల్ వద్దకు చేరుకోగానే అక్కడ మాటు వేసిన పోలీసులు ఎంచక్కా అరెస్టుచేసి లోపల వేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more