విమానయానాన్ని అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్న కేంద్ర విమానయాన శాఖ ప్రయత్నాలు ఫలించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్ ఏషియా న్యూ ఇయర్ అఫర్ లో భాగంగా 917 రూపాయలకే విమానయాన్ని కల్పిస్తుండగా, తాజాగా ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కూడా అదే తరహాలో మరో ఆపర్ ను ప్రకటించింది. ఏయిర్ ఏషియా కన్నా తక్కువ ధరలో నిర్ధేశిత మార్గల్లో ప్రయాణించే అవకాశాన్న కల్పిస్తుంది.
తమ కస్టమర్లతో పాటు విమానయానం చేయాలనుకునే మధ్యతరగతి ప్రజలకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎంపిక చేసిన నిర్ధేశిత మార్గాలలో న్యూఇయర్ స్కీమ్ కింద వన్-వే ఎకనామిక్ క్లాస్ టిక్కెట్లు రూ.849కే అందించనున్నట్టు తెలిపింది. దీనిలోనే అన్ని చార్జీలను కలిపి ఉంటాయని పేర్కొంది. ఈ నెల 31 వరకు ఈ స్కీం కింద కస్టమర్లు తమ టికెట్లను బుక్ చేసుకునే వెసలుబాటును కల్పిస్తుంది.
ఎయిర్ ఇండియా న్యూఇయర్ అపర్ కింద టిక్కట్లు బుక్ చేసుకున్న కస్టమర్లు వచ్చే ఏడాది అనగా.. 2017 జనవరి 15 నుంచి 2017 ఏప్రిల్ 30 వరకు ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తించనుంది. చెన్నై-కోయంబత్తూర్, బెంగళూరు-హైదరాబాద్ మార్గాలలో వన్ వే చార్జీ రూ.849కు అందుబాటులో ఉంచుతున్నట్టు తన వెబ్సైట్లో పొందుపరిచింది. ఇక అ తరువాత ఈ న్యూఇయర్ సేల్ కింద కవర్ అయ్యే మార్గాలు బెంగళూరు-చెన్నైకు రూ.1,199, ముంబాయి-గోవా రూ.1,499, ముంబాయి-బెంగళూరుకు రూ.1,599, శ్రీనగర్-ఢిల్లీకి రూ.1,999కు టిక్కెట్ ధర ఉండనుంది.
ఇతర మార్గాలు గోవా-ఢిల్లీకు రూ.2,999, గోవా-చెన్నైకు రూ.2,199 టిక్కెట్ ధరలు ప్రారంభం కానున్నాయి. ఎయిర్ ఇండియా ప్రకటించిన న్యూఇయర్ ఆఫర్ కేవలం ఎంపికచేసిన సెక్టార్స్పై ఎకనామిక్ క్లాస్లో వన్-వే ప్రయాణాలకు మాత్రమే వర్తించనుంది. గ్రూప్ బుకింగ్స్కు ఇది వర్తించదని ఎయిర్ ఇండియా తెలిపింది. కాగా ఎయిర్ ఇండియా ఆపర్ నేపథ్యంలో ఇతర ఎయిర్ లైన్స్ గతంలో తాము ప్రకటించిన న్యూఇయర్ ఆఫర్లను పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more