పెద్ద నోట్ల రద్దుపై విపక్షాలు చేస్తున్న రాద్ధాంతంపై ప్రధాని మోదీ బిగ్ కౌంటర్ ఇచ్చారు. మరీ ముఖ్యంగా తాను మాట్లాడితే భూమి కంపిస్తుందన్న కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ అరోపణల నేపథ్యంలో ప్రధాని ఇవాళ జరిగిన బీజేపి పార్లమెంటరీ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సహా మాజీ ప్రధాని ఇంధిరాగాంధీని టార్గెట్ చేశారు. అవినీతిని నిర్మూలించడానికి పెద్ద నోట్లను రద్దు చేయాలని వాంచో కమిటీ 1971లోనే ఇందిరాగాంధీకి సిఫార్సు చేశారని పేర్కొన్నారు. కానీ ఆ రిపోర్టును ఇందిరాగాంధీనే తొక్కేసి దేశాన్ని అమ్ముకున్నారని మోడీ సంచలన అరోపణలు చేశారు.
దేశం నుంచి అవినీతి పారద్రోలేందుకు పెద్ద నోట్లను రద్దు చేయడం వంటి నిర్ణయాలను ఎందుకు తీసుకోలేకపోయారని ఆయన కాంగ్రెస్ కు చెందిన మాజీ ప్రధానులు ఇంధిరాగాంధీ సహా అర్థిక రంగణ నిష్ణాతుడు మన్మోహన్ సింగ్ ను నిలదీశాడు. కాంగ్రెస్ పార్టీకి దేశమంటే రాజకీయాలు అందునా కాంగ్రెస్ పార్టీకే ప్రాధన్యమిస్తుందని విమర్శించిన ఆయన తమకు దేశ అంటేనే సుప్రీం అని పార్టీకి పెద్దగా తాము ప్రాధన్యమవ్వమని కూడా చెప్పారు.
దేశంతో పాటు దేశ ప్రజలకు ప్రాధాన్యత వుంటుందని అన్నారు. బ్లాక్మనీ నిర్మూలనకు ప్రభుత్వం నిర్దేశించుకుని లక్ష్యాన్ని ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని మండిపడ్డారు. దేశ రాజకీయాల్లో ప్రస్తుతం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని.. ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా ఇవాళ అధికార పార్టీ నల్లధనానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే... అవినీతిపై గొంతెత్తాల్సిన ప్రతిపక్షాలు తీరు మాత్రం మరోలా ఉందన్నారు.
బీజేపీ పార్లమెంటరీ మీట్ లో ఆయన ప్రసంగిస్తూ.. గత ప్రభుత్వాలు 2జీ, కోల్గేట్ స్కాం వంటి కుంభకోణాల్లో కూరుకుపోగా.. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాడాయని, కానీ ఇప్పుడు నల్లధనంపై ప్రభుత్వం చేస్తున్న పోరాటాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించడం చాలా విడ్డురంగా ఉందని వ్యాఖ్యానించారు. డిజిటల్ ఎకానమీ ఒక జీవన విధానంగా ఉండాలని, అప్పుడే ఆర్థికవ్యవస్థలో పారదర్శకత తీసుకురాగలుగుతామని చెప్పారు. డిజిటల్ లావాదేవీల వాడకంపై ప్రజల్లో ప్రోత్సాహం తేవాలని మోదీ హితబోధ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more