నోట్ల రద్దు నిర్ణయంతో ప్రధాని నరేంద్ర మోదీ నియంతలా ప్రవర్తించాడంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఫైరయ్యాడు. మిలాదున్ నబీ సందర్భంగా ఓ బహిరంగ సభలో అసదుద్దీన్ మోదీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశాడు. మోదీ తన అహాన్ని సంతృప్తిపరచుకునేందుకు దేశంలోని ప్రతి ఇంటినీ ఇబ్బందుల్లోకి నెట్టారని, ఒక్క నిర్ణయంతో ప్రజల జీవన శైలిని ఇబ్బందుల్లోకి నెట్టేశారని ఆరోపించారు. ఎంతో మంది ప్రధానులు వచ్చారు.. వెళ్లారు. మోదీజీ మీరూ కూడా ఏదో రోజు దిగిపోవాల్సిందేనంటూ వ్యాఖ్యానించాడు.
ఇవాళ బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలలో నిల్చున్న వారే రేపు ఎన్నికల్లో పోలింగ్ బూత్ ల ముందు నిల్చుని ఇంటికి పంపిస్తారని హెచ్చరించారు. 15 లక్షల ఖరీదైన సూట్ వేసుకుంటూ, అత్యంత ఖరీదైన షాల్ వేసుకునే వ్యక్తి తనను తాను ఫకీరు అంటారు...మరి ఏ రకమైన ఫకీరో ఆయనకే తెలియాలి' అంటూ ఎద్దేవా చేశాడు. 'మీరు ఫకీరు కాదు నియంత' అని ఆయన ఆవేశంగా అన్నారు. 50 రోజులు బాధలు ఓర్చుకోండి అని చెబుతున్న ఆయన 120 మంది వరకు మరణించినా ఎలాంటి పశ్చాత్తాపం కనబరచడం లేదని మండిపడ్డారు. నోట్ల రద్దు కారణంగా జీడీపీ పడిపోతుందని, 4 లక్షల కోట్ల మేరకు నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారని, ఆయన పీఎం సాబ్ కి అవేంపట్టడం లేదా? అంటూ ప్రశ్నించాడు.
నిర్ణయం వెలువడిన నవంబర్ 8 నుంచి నవంబర్ 30 వరకు 12.5 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో జమ అయ్యాయని, ఆ మొత్తం నల్లధనమేనా? అని ఆయన ప్రశ్నించారు. సెప్టెంబర్ 15 నుంచి 30 మధ్య 3.5 లక్షల కోట్ల రూపాయలు జమ అయ్యాయని, ఈ మొత్తం ఎవరిదో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. మోదీ ఏం చేస్తున్నారో ఆయనకే తెలియదని, ఒకసారి నవ్వుతారని, మరోసారి ఏడుస్తారని, ఇంకోసారి తన ప్రాణాలకు ముప్పు ఉందని అంటారని ఆయన అన్నారు. తాము మాత్రం అయనను 150 ఏళ్లు బతకాలని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more